Begin typing your search above and press return to search.

చరణ్ - బన్నీ లతో మిల్కీ బ్యూటీ...?

By:  Tupaki Desk   |   28 Jun 2020 1:30 AM GMT
చరణ్ - బన్నీ లతో మిల్కీ బ్యూటీ...?
X
సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తన అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్ళైనా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఇప్పటి హీరోయిన్స్ కి పోటీనిస్తూ దూకుడు చూపిస్తోంది. గతేడాది ఏడు సినిమాల్లో నటించిన మిల్కీ బ్యూటీ ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమన్నా బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధికీతో 'బోలే చుడియా' సినిమాలో నటించింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ చేయడానికీ రెడీ అంటున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో ఓ టాక్ షో చేయబోతోందట. అది కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కోసమని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగు ఓటీటీ 'ఆహా' తో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'ఆహా' కి క్రేజ్ తీసుకురావడం కోసం అల్లు అరవింద్ ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధం చేసారు. అంతేకాకుండా మిల్కీ బ్యూటీ తమన్నా తో ఓ టాక్ షో ప్లాన్ చేసారట. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. వీలైనంత త్వరగా ఈ టాక్ షో చేసి 'ఆహా' ఓటీటీ వేదికపై ప్రసారం చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ లభిస్తుండటంతో తమన్నా కూడా డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తమన్నా చేసే ఈ టాక్ షోలో సినీ సెలబ్రెటీలు స్టార్ హీరోలు సైతం పాల్గొనబోతున్నారట. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లతో పాటు మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్ హీరోలు తమన్నాతో టాక్ షో లో ముచ్చటించేందుకు రెడీ అవుతున్నారట. అయితే ఇదంతా అల్లు అరవింద్ ఆలోచనేనట. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ షో కోసం రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకోబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ షో గురించి నిర్వాహకులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందట. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద అల్లు అరవింద్ 'ఆహా' కి క్రేజ్ తీసుకురావడానికి ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.