Begin typing your search above and press return to search.

నంద‌మూరి బాల‌య్యతో అల్లు వారి మ‌రో ప్ర‌యోగం?

By:  Tupaki Desk   |   10 Nov 2022 4:30 PM GMT
నంద‌మూరి బాల‌య్యతో అల్లు వారి మ‌రో ప్ర‌యోగం?
X
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ చాలా రోజుల త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన 'అఖండ‌' మూవీతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ అందించిన స‌క్సెస్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన బాల‌య్య అదే జోష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ని ప‌ట్టాలెక్కించేస్తున్నారు. గీతా ఆర్ట్స్ అధినేత, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌హ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న తొలి తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం తొలి సారి 'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె' అంటూ ఓ టాక్ షోకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.

అల్లు వారి 'ఆహా'లో బాల‌య్య అన్ స్టాప‌బుల్ ఏంటీ? .. ఏం జ‌రుగుతోంద‌నే కామెంట్ లు వినిపించాయి. ఫ‌స్ట్ షో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి అల్లు వారితో బాల‌య్య కాంబినేష‌న్ బ్లాక్ బ‌స్ట‌రే అని నిరూపించింది. ఫ‌స్ట్ సీజ‌న్ హిట్ కావ‌డంతో అదే ఊపులో సెకండ్ సీజ‌న్ ని రీసెంట్ గా మొద‌లు పెట్టారు. ఇది కూడా విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇదిలా వుంటే నంద‌మూరి బాల‌కృష్ణ తో గీతా వారు మ‌రో ప్ర‌యోగానికి తెర‌లేపుతున్నార‌ని తెలుస్తోంది.

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం 'క్రాక్‌' ఫేమ్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా 'వీర సింహారెడ్డి'లో న‌టిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వున్న ఈ మూవీని సంక్రాంతి బ‌రిలో దించేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో బాల‌య్య లుక్ ఇప్ప‌టికే అంచ‌నాల్ని పెంచేసింది.

ఈ మూవీ త‌రువాత బాల‌కృష్ణ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో క‌లిసి 'రామారావు గారు' అనే మూవీని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌య్య వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తిగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత‌లు హ‌రీష్ పెద్ద‌, సాహు గార‌పాటి నిర్మించ‌నున్నారు. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ గీతా ఆర్ట్స్ లో ఓ ప్ర‌యోగాత్మ‌క ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ నేప‌థ్యంలో సాగే సైక‌లాజిక‌ల్ డ్రామాలో న‌టించ‌నున్నాడ‌ట‌. 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ వెంక‌టేష్ మ‌హా ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లే ఈ మూవీ లైన్ ని బాల‌య్య‌కు వినిపించాడ‌ట‌. అంతే కాకుండా కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఈ ప్లాన్, సినిమా కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో బాల‌య్య ..గీతా ఆర్ట్స్ లో మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.