Begin typing your search above and press return to search.

అల్లు వారి ఫ్యామిలీ ముచ్చట.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   3 Jun 2021 11:30 AM GMT
అల్లు వారి ఫ్యామిలీ ముచ్చట.. వీడియో వైరల్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో పాటు అప్పుడప్పుడు వారి పిల్లలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఒక్కోసారి సెలబ్రిటీలకంటే వారి కిడ్స్ ఎక్కువగా క్రేజ్ తెచ్చుకోవడం మనం చూస్తుంటాం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కిడ్స్ చేసే అల్లరి మాములుగా ఉండటం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హా - అల్లు అయాన్ లకు సంబంధించి లేటెస్ట్ వీడియోను ఆయన భార్య స్నేహరెడ్డి షేర్ చేసింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ ఆరుబయట మంచంలో పిల్లలతో ముచ్చటించడం కనిపిస్తుంది.

ఆ వీడియోలో అల్లు అర్జున్ తో పాటు పిల్లలు పడుకొని ఆకాశంలోకి చూస్తున్నారు. అలా ఆకాశంలోకి చూపిస్తూ బన్నీ పిల్లలకు ఏదో చెబుతున్నాడు. ఆ విషయం ఏంటో తెలియదు కానీ పిల్లలకు - బన్నీకి మధ్య ఏదో మంచి మీటింగ్ జరిగిందని టాక్ నడుస్తుంది. ఆ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహ రికార్డు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు వారి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు ఆర్హా ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. నిజానికి ఇంస్టా వీడియోలో అల్లు ఆర్హా ఎంతో క్యూట్ గా ముద్దుగా కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పిల్లల ఫోటోలు, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ కరోనా కారణంగా ఇంటి వద్దే సేదతీరుతున్నాడు. ఇటీవలే తన కొడుకు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్బంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో టూర్ వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూతురు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్నటువంటి ఆ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుండగా మొదటి పార్ట్ పూర్తి చేసుకొని త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా మోస్ట్ డిజైరబుల్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.