Begin typing your search above and press return to search.

స్టార్ యాక్టర్స్ మేకప్ వేసుకోకుండా నటిస్తున్న సినిమా ఇదే!

By:  Tupaki Desk   |   6 Jun 2020 3:30 PM GMT
స్టార్ యాక్టర్స్ మేకప్ వేసుకోకుండా నటిస్తున్న సినిమా ఇదే!
X
'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1990ల నాటి కథాంశంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 90శాతం పైనే షూటింగ్ పూర్తి చేసుకుందట. ఇక ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, సాయిపల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. ఈ సినిమా రాజకీయ సంఘర్షణలతో సాగుతూ.. మహాభారతంలోని విరాటపర్వం ఎపిసోడ్ కి చాలా దగ్గరగా రూపొందుతుందట. ఇక ఈ సినిమా షూటింగ్.. వరంగల్, కేరళ, వికారాబాద్ లలోని దట్టమైన అడవి ప్రాంతాలలో జరిపినట్లు సమాచారం.

వేణు - రానా కాంబినేషన్లో సినిమా రాబోతుందని ప్రకటించినప్పటి నుండి సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఎందుకంటే డైరెక్టర్ విజన్ ఫస్ట్ సినిమాలోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో టాప్ యాక్టర్స్ నటిస్తున్నారు. నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న నందితా దాస్, జరీన్ వాహిబ్, ఈశ్వరి రావు, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే.. ఈ సినిమా నుండి ప్రియమణి ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్. ప్రియమణి ఇందులో నక్సలైట్ భరత్తక్కగా కనిపిస్తుందట. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలోని నటులు ఎవరు కూడా మొహానికి రంగు వేసుకోలేదట. అంటే మేకప్ వేసుకోలేదు. వారి సహజమైన నటనతోనే.. సహజత్వంతో కూడిన క్యారెక్టర్లతో మెప్పిస్తారని సినిమా డైరెక్టర్ వేణు ఊడుగుల తెలిపాడు.

అందరూ కూడా డి-గ్లామర్ రోల్స్ చేస్తున్నారు.. ఒక్కరు కూడా మేకప్ వేసుకోకూడదు అనగానే అందరూ ఓకే చెప్పారని చెప్పాడు. సినిమా మొత్తం నటులు మేకప్ లేకుండా కనిపించడం పెద్ద విశేషం. ఇలా అరుదుగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో రానాకి తల్లిగా జరీనా వాహిబ్ నటిస్తుండగా.. నందిత దాస్ మానవ హక్కుల కోసం పోరాడే మహిళగా కనిపించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కేవలం 10శాతం మిగిలి ఉందట. ఇండస్ట్రీలో అన్నీ పనులు ప్రారంభం అయితే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తాం అంటున్నారు. ఇక ఈ సినిమాను డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.