Begin typing your search above and press return to search.

ఫ్లాప్‌ మూవీకి సీక్వెల్‌ ఎందుకు తంబీ..?

By:  Tupaki Desk   |   20 Sep 2018 11:45 AM GMT
ఫ్లాప్‌ మూవీకి సీక్వెల్‌ ఎందుకు తంబీ..?
X
తమన్నా ద్విపాత్రాభినయంలో, ప్రభుదేవా హీరోగా సోనూసూద్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అభినేత్రి’. తమిళ దర్శకుడు ఎఎల్‌ విజయ్‌ ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. హిందీ వర్షన్‌ కాస్త పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లను రాబట్టింది. కాని తెలుగు మరియు తమిళంలో మాత్రం ఈ చిత్రం మినిమం కలెక్షన్స్‌ ను కూడా రాబట్టలేక పోయింది. అదే కాంబినేషన్‌లో తాజాగా ‘లక్ష్మీ’ అనే చిత్రం వచ్చింది. విజయ్‌ దర్శకత్వంలో ప్రభుదేవా నటించిన లక్ష్మీ చిత్రం కూడా తీవ్రంగా నిరాశ పర్చింది. ఆ చిత్రం ప్రమోషన్‌ సమయంలోనే ‘అభినేత్రి’ చిత్రానికి సీక్వెల్‌ చేస్తున్నట్లుగా ప్రభుదేవా ప్రకటించాడు.

విజయ్‌ దర్శకత్వంలో అభినేత్రి చిత్రానికి సీక్వెల్‌ మొదలు అయ్యింది. ప్రభుదేవాతో పాటు ముఖ్య తారాగణం విదేశాల్లో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సీక్వెల్‌ లో కూడా తమన్నా హీరోయిన్‌ గా కనిపించబోతుంది. అభినేత్రి 2 అనే టైటిల్‌ తో రాబోతున్న ఈ చిత్రం పూర్తిగా సీక్వెల్‌ కాదని - కథ మరియు పాత్రలు పూర్తిగా వేరు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయినా కూడా అభినేత్రి 2 అంటే అభినేత్రికి సీక్వెల్‌ అనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది.

సౌత్‌ లో సూపర్‌ హిట్‌ చిత్రాల సీక్వెల్స్‌ కూడా కొన్ని సార్లు బొక్క బోర్లా పడ్డ సందర్బాలున్నాయి. అలాంటిది ఒక ఫ్లాప్‌ మూవీకి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది తంబీ నీకు అంటూ విజయ్‌ ను సోషల్‌ మీడియాలో ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుదేవా అయినా సీక్వెల్‌ విషయంలో ఆలోచన చేస్తే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొదటి పార్ట్‌ తరహాలోనే ఈ సీక్వెల్‌ కూడా మూడు భాషల్లో విడుదల చేసే విధంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈమద్య విజయ్‌ చేసిన అన్ని చిత్రాలు ఫెయిల్‌ అవుతున్నాయి. మరి ఏ నమ్మకంతో ప్రభుదేవా ఈ చిత్రంను చేసేందుకు ముందుకు వచ్చాడో ఆయనకే తెలియాలి.