Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు శ్రీరంగ నీతులు చెప్పి.. ఇప్పుడు ఇదేం పాడుపని!

By:  Tupaki Desk   |   15 April 2022 2:30 AM GMT
ఇన్నాళ్లు శ్రీరంగ నీతులు చెప్పి.. ఇప్పుడు ఇదేం పాడుపని!
X
సెలబ్రెటీలు తమకు ఉన్న స్టార్‌ డమ్‌ ను ఉపయోగించుకుని కావాల్సినంత సంపాదించుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. కాస్త సిగ్గు మొహమాటం వదిలేస్తే రకరకాలుగా సంపాదించుకునే అవకాశాలు సెలబ్రెటీలకు ఉన్నాయి. అందులో ప్రథానంగా పాన్ మసాలా మరియు ఆల్కాహాల్‌ ప్రమోషన్. ఔను ఈ రెండు ప్రమోషన్ చేయడం ద్వారా భారీ మొత్తంలో పారితోషికం వస్తుంది.

చాలా మంది సెలబ్రెటీలు కాస్త నిజాయితీని మరియు పెద్ద మనసును చాటుకుంటూ ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. కాని కొందరు మాత్రం నిర్మొహమాటంగా ఆ యాడ్స్ కు దూరంగా ఉంటారు. అలాంటి యాడ్స్ లో మేము నటించము అంటూ తేల్చి చెప్తారు. కొన్నాళ్ల క్రితం వరకు అక్షయ్‌ కుమార్‌ పాన్‌ మసాలా ఇంకా కొన్ని నిషేదిత పదార్థాల ప్రమోషన్స్ కు నో చెప్పాడు.

ఒకానొక సమయంలో మాట్లాడుతూ ప్రభుత్వం వాటికి అనుమతించినా కూడా ప్రమోషన్ చేసి జనాల వద్దకు వాటిని తీసుకు వెళ్లడం సబబు కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. కాని ఇప్పుడు అదే అక్షయ్‌ కుమార్‌ ఒక పాన్‌ మసాలా యాడ్‌ లో నటించాడు. అది కూడా మరో స్టార్‌ తో కలిసి నటించి జనాలను ఆ పాన్ మసాలా తినాలంటూ ప్రమోట్‌ చేస్తున్నాడు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీమ్స్ పెద్ద ఎత్తున ట్రెండ్‌ అవుతున్న ఈ సమయంలో అక్షయ్‌ కుమార్ అభిమానులు కూడా కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు శ్రీరంగ నీతులు చెప్పిన అక్షయ్‌ కుమార్‌ ఇలా పాడు పని కి ప్రమోట్‌ చేయడం ఎందుకు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నారు.

హీరోలు ఇలాంటివి ప్రమోషన్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ కొందరు సామాజిక వేత్తలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయినా కూడా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మాత్రం డబ్బుకు కక్కుర్తి పడి వాటికి ప్రమోషన్ చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలకు అయినా ఆ స్టార్‌ లు వెనక్కు తగ్గుతారేమో చూడాలి.