Begin typing your search above and press return to search.

నిర్మాతలకు అక్కినేని అభిమానుల రిక్వెస్ట్.. ఈసారి అలా చేయొద్దని!!

By:  Tupaki Desk   |   30 July 2020 2:30 AM GMT
నిర్మాతలకు అక్కినేని అభిమానుల రిక్వెస్ట్.. ఈసారి అలా చేయొద్దని!!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకి రోజురోజుకి తెలుగు అభిమానుల ఫాలోయింగుతో పాటు అభిమానుల నుండి అండ కూడా బాగానే పెరిగిపోతుంది. ఎలా అనుకుంటున్నారా.. పూజా అందాలను కొందరు ఫాలో అయితే మరికొందరేమో పూజాకి ఏదైనా సమస్య రాగానే అండగా నిలుస్తున్నారు. తాజాగా పూజా అభిమానులు రుజువు చేశారు కూడా.. ఇటీవలే పూజాకి, సమంత అభిమానులకు మధ్య పెద్ద ట్విట్టర్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మాటలకు మాటలే.. కౌంటర్లకు కౌంటరే సమాధానం అన్నట్లుగా సాగింది పరిస్థితి. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. అయితే ఆ పోస్టరులో పూజా తన కాలి వేళ్ళతో అఖిల్ చెవిని మీటుతూ ఉన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఆ పోస్టర్ పై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

ఆ పోస్టర్ చూసినప్పటి నుండి అఖిల్ అభిమానులు హర్ట్ అయినట్లు తెలుస్తుంది. వాళ్లు సినిమా టైటిల్స్ బదులుగా పోస్టర్స్ చూడాలని అనుకుంటున్నారట. అందుకే వారు ఈ సినిమా నిర్మాతలను, హీరోయిన్ పూజ హెగ్డేను ట్రోల్ చేస్తున్నారు. అయితే పూజా తన కాలి వేళ్ళతో అఖిల్ ను తాకడంతో ఫ్యాన్స్ హర్ట్ అయి.. ప్రస్తుతం టాలీవుడ్ రిగ్రెస్సివ్ బ్యాచ్ అంతా ఎక్కడికి పోయారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహేష్ బాబు నటించిన 'వన్.. నేనొక్కడినే' సినిమా టాపిక్ కూడా బయటికి వచ్చింది. ఆ సినిమాలో మహేష్ బాబు అడుగులను కృతిసనన్ చేతులతో తాకుతూ వెళ్తుంది. మరి ఇక్కడ హీరోయిన్ పూజాను హైలైట్ చేస్తూ హీరోను తగ్గించారంటూ అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. అయితే మరోసారి పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు హీరోను తగ్గించకుండా జాగ్రత్త పడగలరని అభిమానులు నిర్మాతలను కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. పూజా ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్టర్లో ఆమె అందమైన కాళ్ళను చూసుకుంటూ.. "నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు" అంటూ సాంగ్ పాడుకుంటున్నారు.