Begin typing your search above and press return to search.

నిజంగా నా జీవితాన్ని మార్చావు.. అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను : అఖిల్

By:  Tupaki Desk   |   24 Sep 2020 3:30 PM GMT
నిజంగా నా జీవితాన్ని మార్చావు.. అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను : అఖిల్
X
సెలబ్రిటీల ఇళ్లలో పని మనుషులు వంట మనుషులే అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు సినిమా షూటింగులతో బిజీగా గడిపే వారికి ఇంటి పనులు చేసుకునేంత తీరిక ఉండదు. అందుకే ప్రతి మనిషికి సహాయంగా ఇంకో మనిషిని పెట్టుకుంటారు. కాకపోతే ఈ మధ్య కరోనా లాక్ డౌన్ కారణంగా సహాయకులు ఎవరూ దైర్యం చేసి రాకపోవడంతో కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇంటి పని వంటపని చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు వంటలు నేర్చుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ విషయానికొస్తే నాగార్జున సతీమణి అమల కు వంట రాదనే విషయం తెలిసిందే. ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. తనకంటే నాగార్జునే బాగా వండుతాని.. చైతన్య కూడా బాగా వండుతాడని పేర్కొంది. అందుకే అమల, నాగార్జున, అఖిల్‌ కు వండి పెట్టేందుకు అక్కినేని ఇంట్లో ఓ స్పెషల్ చెఫ్‌ ను పెట్టుకున్నారు. 'కుకి కుక్స్' కి చెందిన కైరావి మెహతా కొన్నాళ్లుగా వారికి వండి పెడుతోంది.

అక్కినేని ఇంటికి కైరావి మెహతా వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అఖిల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి తమకు అద్భుతంగా వండి పెట్టినందుకు ఆమె పై ప్రశంసలు కురిపించాడు. ''కైరావి మాకు మంచి ఆరోగ్యం, చక్కటి ఆహారాన్ని అందించింది. హెల్తీ ఫుడ్ తినడం నాకు ఓ లక్ష్యంగా ఉండేది. అందుకోసం పోషకాహారాలు.. వాటిపై అవగాహన ఉన్న వారి కోసం చూశాం. అద్భుతమైన డైట్ ప్లాన్ చేయాలని ఆశించాను. నువ్వు నిజంగా మమ్మల్ని మార్చేసావు కైరావీ. నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు ఇంకా బాగా వండి పెట్టాలని.. నువ్వు చేసే ప్రతీ పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అఖిల్ పోస్ట్ చేశాడు. దీనికి చెఫ్ కైరావి మెహతాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీనికి కైరావి 'ఇదో అద్భుతమైన సవాళ్లతో కూడుకున్న ఏడాది.. ప్రతీ రోజూ ఎంతో ఎంజాయ్ చేశాను. నాగార్జున, అమల గారికి వండిపెట్టడం సంతోషంగా ఉంది' అని రిప్లై ఇచ్చింది. ఇంతకముందు కూడా నాగార్జున - అమల తో కైరావి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.