Begin typing your search above and press return to search.

అఖిల్‌ కంపల్సరీగా ప్రకటిస్తాడు కదూ?

By:  Tupaki Desk   |   6 April 2016 4:39 AM GMT
అఖిల్‌ కంపల్సరీగా ప్రకటిస్తాడు కదూ?
X
ఉగాది పండుగ రోజున అక్కినేని అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు నాగార్జున. తొలి మూవీతో అఖిల్ తో అభిమానులను, తనను తాను నిరాశపరుచుకున్నాడు. అందుకే అఖిల్ కెరీర్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగ్.

అఖిల్ సెకెండ్ మూవీ లేట్ అవడానికి నాగ్ ఎలర్ట్ గా ఉండడమే కారణం. ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యంతో.. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. డైరెక్టర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు నాగార్జున. అయితే.. డిఫరెంట్ కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన వంశీ పైడిపల్లిని, అఖిల్ రెండో సినిమా డైరెక్టర్ గా చేస్తాడనే వార్తలొచ్చాయి. కానీ.. బాలీవుడ్ మూవీ 'యే జవాని హై దివానీ'ని రీమేక్ చేయమని కోరడంతో వంశీ వెనక్కి తగ్గాడని అన్నారు.

కానీ ఇప్పుడు ఉగాది రోజున అఖిల్ సెకండ్ సినిమాపై అనౌన్స్ మెంట్ కి రెడీ అవుతున్నారట నాగ్. అది కూడా వంశీ పైడిపల్లినే దర్శకుడిగా ఫైనల్ చేశారని తెలుస్తోంది. మరి ఇది రీమేక్ సినిమానో.. లేక వేరే స్టోరీనా అని తెలియాల్సి ఉంది. మొత్తానికి అఖిల్ రెండో సినిమా ప్రకటించనుండంతో ఫ్యాన్స్ మాత్రం హుషారుగా ఉన్నారు. మరి మనోడు కంపల్సరీగా ప్రకటించాల్సిందే.