Begin typing your search above and press return to search.

'అఖండ' మేకర్స్‌ మౌనంకు కారణం ఏంటో?

By:  Tupaki Desk   |   30 April 2021 1:30 PM GMT
అఖండ మేకర్స్‌ మౌనంకు కారణం ఏంటో?
X
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబోలో సింహా మరియు లెజెండ్‌ సినిమాల తర్వాత రాబోతున్న అఖండ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ సినిమా ఉంటుందని తాజాగా విడుదల అయిన టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. అఖండ టీజర్ అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ ల వ్యూస్‌ ను దక్కించుకోవడంతో పాటు 4.5 లక్షల లైక్స్ ను దక్కించుకుంది. ఇంతటి క్రేజ్ ఉన్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి ఉండకుంటే ఉంటే మే 28వ తారీకున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవారు.

అఖండ సినిమాను మే 28న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కరోనా వల్ల మే నెలలో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఆచార్య వాయిదా పడగా ఇటీవలే నారప్పను కూడా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు. మే చివరి వారంలో అఖండ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఇప్పటి వరకు విడుదల తేదీని మార్చుతున్నట్లుగా మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంకా టైమ్‌ ఉంది.. అప్పటి వరకు ఏమైనా జరుగవచ్చు అనుకుని విడుదల తేదీని వాయిదా వేయడం లేదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్యాచ్‌ వర్క్‌ వారం పది రోజుల వర్కింగ్‌ డేస్‌ తో పూర్తి చేస్తారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గినట్లుగా అనిపిస్తే షూటింగ్‌ ను ముగించి అనుకున్న తేదీకి విడుదల చేయాలని ఏమైనా ప్లాన్‌ చేస్తున్నారేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే జూన్‌ నెల చివరి వరకు కూడా సినిమాల విడుదలకు సరైన సమయం కాదనిపిస్తుంది. కనుక కాస్త ఆలస్యంగా అయినా అఖండ విడుదల వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు.