Begin typing your search above and press return to search.

ఆ విషయంలో 'అఖండ' బార్డర్ దాటిపోతుందా..??

By:  Tupaki Desk   |   30 April 2021 3:30 AM GMT
ఆ విషయంలో అఖండ బార్డర్ దాటిపోతుందా..??
X
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ మూవీ అంటేనే ఊరమాస్ అని ఇదివరకే ప్రూవ్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా అఖండ. ఇటీవలే విడుదల చేసిన అఖండ టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజి రెస్పాన్స్ దక్కించుకుంది. అఖండ టీజర్ లో బాలయ్య జోరు చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి బోయపాటితో హ్యాట్రిక్ కొడతాడని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అసలే బోయపాటి - బాలయ్య కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో ఎన్నడూలేని హుషారు కనిపిస్తుంది. మరిప్పుడు ఏకంగా మూడో సినిమా వచ్చేస్తుంటే ఇంకా సందడి చేయకుండా ఊరుకుంటారా..

అయితే ఈ మాస్ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాను మే 28న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు సినిమాలను వాయిదాపడేలా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బాలయ్య - బోయపాటి అఖండ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ అనుకున్న దానికంటే బడ్జెట్ బార్డర్ దాటి పోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ (60కోట్ల పైగా) బడ్జెట్ పెట్టి సినిమాను రూపొందిస్తున్నారని టాక్. చూడాలి మరి ఓవైపు టీజర్ క్వాలిటీ చూస్తే నిజమే అనిపిస్తుంది. కానీ మేకర్స్ నుండి నిజం బయటికి రావాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ కాగా మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.