Begin typing your search above and press return to search.

వరుసగా మూడవ సారి ఆయనతోనే సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   29 April 2021 6:33 AM GMT
వరుసగా మూడవ సారి ఆయనతోనే సూపర్‌ స్టార్‌
X
తమిళ సూపర్‌ స్టార్ అజిత్‌ ప్రస్తుతం వినోత్‌ దర్శకత్వంలో వాలిమై చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాను బోనీకపూర్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల తుది దశ చిత్రీకరణ ఆగిపోయింది. మళ్లీ సినిమా ను పునః ప్రారంభించి ముగించేందుకు దర్శకుడు ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో వినోత్‌ మరో సినిమా ను అజిత్‌ తో చేసేందుకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే కథకు అజిత్ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఆ సినిమాను కూడా బోనీ కపూర్‌ నిర్మించబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పింక్ ను తమిళంలో వినోత్‌ దర్శకత్వంలో అజిత్ హీరోగా బోనీ కపూర్‌ నిర్మించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మళ్లీ వాలిమై సినిమాను వీరు ముగ్గురు కలిసి చేస్తున్నారు. వాలిమై సినిమా సమయంలోనే మరో సినిమా వీరి కాంబోలో పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అజిత్ కు ఒక దర్శకుడు నచ్చితే వరుసగా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. గతంలో దర్శకుడు శివ తో బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లు చేశాడు. ఇప్పుడు వినోత్‌ దర్శకత్వంలో వరుసగా మూడవ సినిమా ను చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే అడ్వాన్స్ ను కూడా ఇచ్చాడని తెలుస్తోంది. వాలిమై సినిమా పై తమిళ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వాలిమై సక్సెస్ అయితే మూడవ సినిమా ఖచ్చితంగా పీక్స్ అన్నట్లుగా బిజినెస్ చేయడం ఖాయం. కనుక అజిత్‌ కు భారీ పారితోషికంను బోనీ కపూర్‌ ఆఫర్‌ చేశాడని అలాగే లాభాల్లో వాటాను కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వరుసగా మూడవ సారి కూడా వారితో సినిమాను చేసేందుకు అజిత్‌ కమిట్‌ అవ్వడం ప్రస్తుతం కోలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.