Begin typing your search above and press return to search.

బ్రేక‌ప్ ప్ర‌క‌టించాకా ప్రేమ‌గీత‌మా?

By:  Tupaki Desk   |   22 Jan 2022 1:30 PM GMT
బ్రేక‌ప్ ప్ర‌క‌టించాకా ప్రేమ‌గీత‌మా?
X
విడాకుల ప్ర‌హ‌స‌నం అనంత‌రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ ఐట‌మ్ నంబ‌ర్ కి ఓకే చెప్పిన సామ్ త‌దుప‌రి బాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది.

చై-సామ్ విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం షాక్ నిస్తూ ధ‌నుష్ - ఐశ్వ‌ర్య జంట విడాకుల‌ను ప్ర‌క‌టించారు. ఇది ఊహించ‌నిది. 18ఏళ్ల కాపురం అనంత‌రం ఈ జంట విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం అభిమానుల్ని క‌ల‌వ‌రపెట్టింది.

ఇదిలా ఉంటే ఐశ్వ‌ర్య ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే.. తాను కూడా సామ్ తీరుగానే కెరీర్ పైనే ఫోక‌స్ చేశారు. జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె అప్పుడే తన వృత్తిలో మునిగిపోయింది. స్వ‌త‌హాగా తాను నిర్మాత కం ద‌ర్శ‌కురాలు కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఓ ప్రేమ‌గీతాన్ని తెర‌కెక్కిస్తూ బిజీగా ఉన్నార‌ట‌. తానే ఈ పాట‌కు ద‌ర్శ‌కురాలు కావ‌డం విశేషం. నిర్మాత ప్రేర‌ణ అరోరాతో క‌లిసి ఈ పాట చిత్రీక‌ర‌ణ కోసం ర‌క‌ర‌కాల ప్లాన్ ని ఐశ్వ‌ర్య డిజైన్ చేశార‌ట‌. ఆస‌క్తిక‌రంగా ఇది వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ సాంగ్‌ అని కూడా తెలుస్తోంది. హైదరాబాద్ లో నే ఈ పాట‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీవ‌ర్క్ పై ఐశ్వ‌ర్య పూర్తిగా దృష్టి సారించారు.

ఇంత‌కుముందు ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా `ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తారు!` అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చ‌ర్చ‌కు తావిచ్చాయి. వారు క‌లుస్తారా.. లేదా? అంటూ సోష‌ల్ మీడియాల్లో డిబేట్లు ర‌న్ అవుతున్నాయి.