Begin typing your search above and press return to search.

మొన్న మగాళ్లపై అడల్ట్ జోక్.. ఇప్పుడు లేడీతో లిప్ లాక్..!

By:  Tupaki Desk   |   15 Sep 2022 8:38 AM GMT
మొన్న మగాళ్లపై అడల్ట్ జోక్.. ఇప్పుడు లేడీతో లిప్ లాక్..!
X
టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న రెజీనా కసాండ్రా.. ఇప్పుడు నివేదా థామస్ తో కలిసి "శాకిని డాకిని" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు శుక్రవారం థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలో రెజీనా - నివేదా అన్ని మాధ్యమాల్లో సినిమాను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రెజీనా.. 'శాకిని డాకిని' కి బజ్ తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో డబుల్ మీనింగ్ జోక్స్ చెప్పడమే కాదు.. లిప్ లాక్ అనుభవం గురించి మాట్లాడుతోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. మగవాళ్లను మ్యాగీతో కంపేర్ చేస్తూ చెప్పిన '2 మినిట్స్' అడల్ట్ జోక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 'అబ్బాయిలు - మ్యాగీ రెండూ ఒకటే. ఎందుకంటే రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి' అంటూ రెజీనా అనడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు లేటెస్టుగా మరో ఇంటర్వ్యూలో రెజీనా ఒక మహిళతో తన లిప్ లాక్ అనుభవాన్ని పంచుకున్నట్లు వెల్లడించింది. ఒకసారి ఓ మహిళ తన వద్దకు వచ్చి తన పెదాలను ముద్దాడి షాక్ ఇచ్చిందని తెలిపింది. మొదట్లో సర్ప్రైజ్ అయినప్పటికీ, ఆ వ్యక్తి ఒక మహిళ అయినందున వెనక్కి నెట్టలేదని చెప్పింది.

అయితే అదే ఆ పని చేసింది ఒక మగాడైతే కచ్చితంగా చెంపదెబ్బ కొట్టేదాన్నని రెజీనా పేర్కొంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు పబ్లిసిటీ చేయడానికి రెజీనా తనవంతు ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.

మొన్న మగాళ్లు - మ్యాగీ 2 మినిట్స్ అంటూ కామెంట్స్ చేసిన రెజీనా.. ఇప్పుడు అమ్మాయితో లిప్ లాక్ గురించి చెప్పి తన చిత్రాన్ని ప్రమోట్ చేయాలని చూస్తోంది. కానీ ఎంత చేసినా సినిమాకు కావాల్సినంత బజ్ రావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి 'శాకిని డాకిని' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారట. దీనికి సంబంధించిన డీల్స్ కోసం ప్రముఖ ఓటీటీతో చర్చలు జరుగుతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు థియేటర్ లోనే విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారట.

సుధీర్ వర్మ బ్రాండ్ తప్ప ఈ సినిమాకున్న ప్లస్ ఇంకేమీ లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే దర్శకుడు కూడా రవితేజ సినిమా పనులతో బిజీగా ఉంటూ.. 'శాకిని డాకిని' ప్రమోషన్స్ ను లైట్ తీసుకున్నట్లు మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం దర్శకుడి క్రియేటివ్ వ్యవహారాల్లో నిర్మాతలు జోక్యం చేసుకోవడమే అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

'శాకిని డాకిని' అనేది 'మిడ్ నైట్ రన్నర్స్' అనే సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ చిత్రానికి తెలుగు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ - క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై డి. సురేష్ బాబు - సునీత తాటి - హ్యూన్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.