Begin typing your search above and press return to search.

అద్నాన్ సామీ ఏం చెప్పాడో విన్నారా!!

By:  Tupaki Desk   |   3 Oct 2016 6:46 AM GMT
అద్నాన్ సామీ ఏం చెప్పాడో విన్నారా!!
X
బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామీ పుట్టినది పాకిస్తాన్ లో అనే సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఈయన భారతీయుడే. మన దేశ పౌరసత్వాన్ని ఎప్పుడో పుచ్చుకున్నాడు కూడా. ప్రస్తుతం భారత్-పాక్ ల మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణంపై అద్నాస్ స్పందించాడు. బాలీవుడ్ టాప్ స్టార్లుగా వెలిగిపోతూ.. అసహనంతో రగిలిపోతున్న వారికి భిన్నంగా అద్నాన్ సామీ స్పందన ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను పాక్ పౌరులు ఖండిస్తుంటే.. వారికి సమాధానం ఇస్తూ.. వాస్తవాన్ని తెలియచెప్పే ప్రయత్నం చేశాడు ఈ మేటి సింగర్. 'ఈ ట్వీట్ నా గుండె లోతుల్లోంచి వచ్చింది. నన్ను విమర్శించిన వారిని వేడుకుంటున్నా. ఈ సర్జికల్ స్ట్రైక్ ఎవరిపై జరిగిందో.. ఎవరిపై కాదో వాస్తవాన్ని పరిశీలించాలి. ఇది భూభాగం దక్కించుకునేందుకు చేసిన టెర్రరిస్ట్ దాడి కాదు. జరిగిన దాడికి ప్రతిదాడి మాత్రమే. ఈ దాడి టెర్రరిస్ట్ క్యాంప్ ను మాత్రమే టార్గెట్ చేసింది. ఉగ్రవాదానికి బోర్డర్లు ఉండవు. ముంబై.. పెషావర్.. పారిస్.. ఇలా ఎక్కడికైనా వెళ్లిపోగలదు' అన్నాడు అద్నాన్ సామీ.

'పక్కింట్లో చెత్త పేరుకుపోతుంటే ఏం చేయాలి? తీసేయమని చెప్పాలి.. చేయకపోతే ఇద్దరం కలిసి శుభ్రం చేద్దామని చెప్పాలి. అప్పుడే మన పిల్లలు శాంతిగా బతకగలమనే విషయాన్ని వివరించాలి. పర్నసల్ గా తీసుకోవడం ఎందుకు. మసీదులను పేల్చేస్తున్న సూసైడ్ బాంబర్స్ ఉన్న విషయం తెలియదా?' అంటూ పాక్ ప్రజలకే సుద్దులు చెప్పాడు అద్నాన్ సామీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/