Begin typing your search above and press return to search.

ఈ 7.11 సెంటిమెంట్ ఏంది డార్లింగ్...!

By:  Tupaki Desk   |   2 Sep 2020 5:31 PM GMT
ఈ 7.11 సెంటిమెంట్ ఏంది డార్లింగ్...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ''ఆదిపురుష్'' అనే స్ట్రెయిట్ హిందీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'చెడుపై మంచి సాధించిన విజ‌యం' అనే థీమ్‌ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. వెండితెర 'బాహుబలి' ఇప్పుడు 'రాముడి' అవతారం ఎత్తబోతున్నాడని ఫ్యాన్స్ అందరూ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'ఆదిపురుష్' నుంచి మరో అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ''7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉన్నాడు!.. రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు వెల్లడిస్తాం'' అంటూ డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రేపు రాబోయే అప్డేట్ ఏంటనేది పక్కన పెడితే ప్రభాస్ 'ఆదిపురుష్' విషయంలో 7.11 am ని సెంటిమెంట్ గా భావిస్తున్నాడేమో అని అనుకుంటున్నారు.

కాగా, ప్ర‌భాస్ ఇంతకముందు 'ఆదిపురుష్' సినిమాకి సంబంధించి ఆగస్టు 18న ఉదయం 7 గంటల 11 నిమిషాలకు బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించాడు. ఈ క్రమంలో చెప్పిన సమయానికి డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'ఆదిపురుష్' ని ప్రకటించి టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు తాజాగా 'ఆదిపురుష్' నుంచి మరో అప్డేట్ రేపు ఉదయం 7.11 am కి రాబోతోందని ప్రకటించాడు. దీంతో ప్రభాస్ కి 7+1+1 = 9 సెంటిమెంట్ ఉందేమో అందుకే ఆ సమయానికి అప్డేట్స్ ఇస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి కామన్ అని తెలిసినప్పటికీ డార్లింగ్ ప్రభాస్ కి ఈ సెంటిమెంట్ ఉండటం అందరికి ఆసక్తిని కలిగించింది.

ఇదిలా ఉండగా 3-డీ లో రూపొందనున్న 'ఆదిపురుష్' చిత్రాన్ని టీ-సిరీస్ భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రభాస్ కెరీర్లో 22వ చిత్రంగా రానున్న 'ఆదిపురుష్'ని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని తెలుగు హిందీ భాషల్లో నిర్మించి తమిళం - మలయాళం - కన్నడ భాషలలో పాటు అనేక విదేశీ భాషల్లోకి అనువదించనున్నారని తెలుస్తోంది.