Begin typing your search above and press return to search.

అభిమానికి ఆదిపురుష్‌ ఖరీదైన బహుమానం

By:  Tupaki Desk   |   17 Nov 2021 5:08 AM GMT
అభిమానికి ఆదిపురుష్‌ ఖరీదైన బహుమానం
X
పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా కీర్తించబడుతున్న యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో సందేహం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. యూత్ ఆడియన్స్ ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే పడి చచ్చి పోతారు. ప్రభాస్ ను అభిమానించే వారు రకరకాలుగా తమ అభిమానంను సోషల్ మీడియా ద్వారా చూపిస్తూ ఉంటారు. ఇటీవల ప్రభాస్ సినిమా రాధే శ్యామ్‌ పాట ఆలస్యం అయినప్పుడు.. ఆయన ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయని సమయంలో అభిమానులు ఏ రేంజ్ లో యూవీ క్రియేషన్స్ ను ట్రోల్‌ చేశారో తెల్సిందే. సోషల్‌ మీడియాలో ఏకంగా యూవీ క్రియేషన్స్ ను ట్రోల్‌ చేసి ట్రెండ్‌ చేసిన ఘనత ప్రభాస్ అభిమానులకు దక్కింది. సోషల్‌ మీడియాలో ప్రభాస్ అభిమానులు సెన్షేషన్ క్రియేట్‌ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తనపై ఎంతో అభిమానం చూపిస్తున్న అభిమానులు అంటే ప్రభాస్ కు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. వారి కోసం ఎంత చేసినా తక్కువే.. ఏం చేసినా తక్కువే అంటూ ప్రభాస్ పదే పదే అంటూ ఉంటాడు. తాజాగా ప్రభాస్ తన వీరాభిమానిని కలిశాడు. అతడు తన తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా జుట్టు కట్‌ చేసుకున్నాడు. అది చూసి ప్రభాస్ నవ్వుకున్నాడు. అతడి అభిమానంకు ముచ్చటేసిన ప్రభాస్ కొద్ది సమయం పక్కన కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆ వీరాభిమానికి ఖరీదైన వాచ్ ను కూడా బహుమానంగా ప్రభాస్‌ అందజేశాడు. ప్రస్తుతం ఆ వీరాభిమాని ఫొటో మరియు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ వాచ్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ మంచి మనసు మరోసారి ఇలా నిరూపితం అయ్యింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ ఉన్నారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దం అయ్యింది. షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిన రాధే శ్యామ్‌ సినిమా అతి త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ ను కూడా పూర్తి చేసుకోబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఆదిపురుష్‌ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం మోషన్ గ్రాఫిక్స్ వర్క్‌ జరుగుతోంది. ఆదిపురుష్ ను 2022 ఆగస్టులో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. త్వరలో సలార్ కొత్త షెడ్యూల్‌ లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ రూపొందుతున్న విషయం తెల్సిందే.

మరో వైపు మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కే అనే భారీ పాన్ వరల్డ్ మూవీని ప్రభాస్ చేయబోతున్నాడు. ఇటీవలే సందీప్‌ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను కూడా ప్రకటించిన ప్రభాస్ వచ్చే రెండేళ్లు ఫుల్‌ బిజీగా వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. అభిమానుల ముందుకు 2022 లో రెండు లేదా మూడు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాహుబలి.. సాహో సినిమా లకు ఎక్కువ సమయం తీసుకున్న కారణంగా ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ప్రభాస్ తన 25వ సినిమా మార్క్ ను దాటలేక పోయాడు. అందుకే ఏడాదికి రెండు మూడు సినిమాలైనా ఇకపై చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.