Begin typing your search above and press return to search.

స్పై థ్రిల్లర్ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్న యువ హీరో...!

By:  Tupaki Desk   |   18 April 2020 10:30 AM GMT
స్పై థ్రిల్లర్ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్న యువ హీరో...!
X
టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా అడుగు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. వారికి సినిమా మీద ఉండే ఫాషన్ వాళ్ళని ఆ రేంజ్ కి తీసుకొచ్చింది. అడవి శేష్ కూడా అదే కోవకి చెందుతాడు. సినిమా మీద ఫ్యాషన్ తో కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నాడు. ఈ హీరో టాలీవుడ్ కి వచ్చి చాలా ఏళ్ళైనప్పటికి గత రెండు మూడేళ్ళుగా వచ్చిన సినిమాలతోనే మంచి ఫేంని సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్ కాకపోయినప్పటికి మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇప్పుడున్న కొందరు యంగ్ హీరోలతో పొల్చుకుంటే అడవి శేష్ చేస్తున్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ, స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది. అలాగే క్రియేటివ్ థాట్స్ తో మంచి స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకోవడం లో అడవి శేష్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. హీరోగా 'క్షణం' 'గూఢచారి' 'ఎవరు' చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాగా అడవి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాకి సీక్వెల్ తీస్తానని ఇంతకముందే శేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగులు లేక తగినంత సమయం దొరకడంతో అడవి శేష్ 'గూఢచారి 2' స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట. లిమిటెడ్ బడ్జెట్ తో చిన్న సినిమాగా 2018లో రిలీజైన ఈ స్పై థ్రిల్లర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, శోభితా దూళిపాళ్ల, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్ గా రాబోతున్న 'గూఢచారి 2' వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా అడవి శేష్ ప్రస్తుతం 'మేజర్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశారని సమాచారం. శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 26/11 ముంబై ఘటనలో వీర మరణం చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నాడు అడవి శేష్.