Begin typing your search above and press return to search.

దిమ్మతిరిగే రేటుకి శర్వా 'ఆడవాళ్ళు..' థియేట్రికల్ రైట్స్..!

By:  Tupaki Desk   |   9 Feb 2022 12:47 PM GMT
దిమ్మతిరిగే రేటుకి శర్వా ఆడవాళ్ళు.. థియేట్రికల్ రైట్స్..!
X
యంగ్ హీరో శర్వానంద్‌ కెరీర్ ప్రారంభం నుంచీ ఒకే జోనర్ కు పరిమితం కాకుండా.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ లో శర్వాకు విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో ఆయన నటించిన ప్యూర్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు కొన్ని బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ మూవీపై క్రియేట్ అయిన బజ్ తో 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రం ట్రేడ్ వర్గాల్లో హాట్ కేక్‌ గా మారింది.

'ఆడవాళ్ళు..' సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఇది శర్వానంద్‌ కెరీర్ లోనే అతిపెద్ద డీల్ అనుకోవాలి. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ సోనీ లివ్ సంస్థ కొనుగోలు చేయగా.. లహరి మ్యూజిక్ మూవీ ఆడియో హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇటీవల వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టైటిల్ ట్రాక్‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో రేపు గురువారం (ఫిబ్రవరి 10) చిత్ర టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాబోయే రోజుల్లో శరవేగంగా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ కెమెరామెన్ సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రాన్ని ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.