Begin typing your search above and press return to search.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం ముగ్గురు ఎవర్‌గ్రీన్ నటీమణులు..!

By:  Tupaki Desk   |   3 Aug 2021 6:24 AM GMT
ఆడవాళ్లు మీకు జోహార్లు కోసం ముగ్గురు ఎవర్‌గ్రీన్ నటీమణులు..!
X
యువ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ తోనే ఈ సినిమాలో ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ కు మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే టైటిల్‌ అన్ని వర్గాల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో తాజాగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్ర యూనిట్ ఓ ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చింది. ఎవర్‌ గ్రీన్ నటీమణులు ఖుష్బూ - రాధిక శరత్‌ కుమార్ మరియు ఊర్వశి ఈ ప్రాజెక్ట్‌ లో భాగం అవుతున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో చాలా కీలకమైన మూడు మహిళా పాత్రలు కోసం ముగ్గురు అత్యంత ప్రతిభావంతులైన నటీమణులను ఎంపిక చేసుకున్నారు కిషోర్ తిరుమల. ఈ ప్రత్యేకమైన చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు చాలా ప్రత్యేక పాత్రల్లో కనిపించడం కన్నుల పండుగగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ మరియు ఊర్వశి కూడా షూట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.