Begin typing your search above and press return to search.

ఆ పోలీసు అధికారి పెళ్లి చేసుకొని మోసం చేశాడు.. వర్థమాన నటి కంప్లైంట్

By:  Tupaki Desk   |   16 April 2021 9:30 AM GMT
ఆ పోలీసు అధికారి పెళ్లి చేసుకొని మోసం చేశాడు.. వర్థమాన నటి కంప్లైంట్
X
కోలీవుడ్ కు చెందిన ఒక వర్థమాన నటి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సబ్ ఇన్ స్పెక్టర్ ఒకరు తనను పెళ్లి చేసుకొని మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదును ఆమె పోలీసులకు ఇచ్చారు. ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సుందరం ట్రావెల్స్ చిత్రంలో తమిళ సినీ రంగానికి పరిచయమైన 38 ఏళ్ల రాధ కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె విరుగ్గంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వసంత్ రాజ్ పై కంప్లైంట్ చేయటం సంచలనంగా మారింది.

ఇరువురికి సంబంధించి బయటకు వచ్చిన వివరాల ప్రకారం.. వీరి మధ్య రిలేషన్ రచ్చకెక్కటానికి కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భర్తతో విడాకులు తీసుకున్న రాధ.. తల్లి.. కొడుకుతో కలిసి చెన్నై శాలిగ్రామంలో నివసిస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ లో భాగంగా తిరువాన్మియూరు ఎస్ఐ వసంత్ ఆమెకు పరిచయమైంది. అతడికి భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి రాధతో ఎక్కువగా గడిపేవాడు. దీనిపై వసంత్ సతీమణి గతంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

దీన్ని పట్టించుకోని అతడు.. రాధతో మరింత సన్నిహితంగా ఉండటంతోపాటు. రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెబుతారు. ఎస్ఐ వసంత్ కు చెప్పకుండా నటి రాధ తన ఆధార్ కార్డులోనూ.. తన కొడుకు ఆధార్ కార్డులోనూ భర్త.. తండ్రి పేర్ల స్థానంలో అతడి పేరును మార్చినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వసంత్ ఆమెకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. దీంతో.. భరించలేని రాధ.. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి గొడవ పడగా.. ఆమెను బెదిరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే తన భర్త మోసం చేసినట్లు వసంత్ భార్య ఫిర్యాదు చేయగా.. తనను మోసం చేసినట్లు రాధ రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మరీ.. ఉదంతం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.