Begin typing your search above and press return to search.

పాపం .. నిత్యా మీనన్ ను ఆరేళ్లు వేధించాడట!

By:  Tupaki Desk   |   7 Aug 2022 7:16 AM GMT
పాపం .. నిత్యా మీనన్ ను ఆరేళ్లు వేధించాడట!
X
వెండితెరపై కథానాయికగా నిలదొక్కుకోవాలంటే .. స్టార్ డమ్ ను సంపాదించాలంటే స్కిన్ షో చేయవలసిందే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాంటి అభిప్రాయం కరెక్టు కాదని నిరూపించిన అతికొద్ది మంది కథానాయికలలో నిత్యామీనన్ ఒకరు. స్కిన్ షో అనే మాటకి చాలా దూరంగా ఉంటూనే ఆమె తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మలయాళ సినిమా ద్వారా నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నిత్యామీనన్, ఆ తరువాత కన్నడ .. తెలుగు .. తమిళ భాషల్లో అడుగుపెట్టింది.

చూడటానికి నిత్యా మీనన్ ముద్దుగా .. ముద్దమందారం మాదిరిగా ఉంటుంది. విశాలమైన కళ్లతో అద్భుతమైన హావభావాలను పలికిస్తుంది. 'అలా మొదలైంది' సినిమాతో తెలుగు తెరకి ఆమె పరిచయమైంది. ఈ పుష్కర కాలంలో 'ఇష్క్' .. 'గుండెజారి గల్లంతయ్యిందే' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'జనతా గ్యారేజ్' వంటి హిట్స్ ఆమె ఖాతాలో కనిపిస్తాయి. నటన ప్రధానమైన పాత్రలలో .. నాయిక ప్రధానమైన కథలలో తనకి సాటిలేదని నిత్యామీనన్ నిరూపించుకుంది. అన్ని ప్రాంతాలలో కూడా తన అభిమానుల సంఖ్యను పెంచుకుంది.

కథానాయికలను చాలామంది అభిమానిస్తుంటారు .. ఆరాధిస్తుంటారు. ఆ అభిమానం వెర్రితలలు వేసిన కొంతమంది కారణంగా కొంతమంది కథానాయికలు ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి. అలా తాను కూడా చాలా ఇబ్బందిపడినట్టుగా నిత్యామీనన్ చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " సంతోష్ వర్గీ అనే ఒక వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారం చేశాడు. అతను అలా ప్రచారం చేయడం నన్ను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసింది. ఆరేళ్లుగా అతని వేధింపులు కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయంలో విసిగిపోయిన మా పేరెంట్స్ కూడా అతనిని హెచ్చరించారు.

సంతోష్ వర్గీ తన ధోరణి మార్చుకోకపోవడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని చాలామంది చెప్పారు. కానీ నేనే అతనిని క్షమించి వదిలేశాను. తన గురించి సంతోష్ చెప్పేవన్నీ అబద్దలనీ .. ఇకపై అతను ఏం చెప్పినా ఎవరూ నమ్మొద్దని అంది. ప్రస్తుతం నిత్యామీనన్ నుంచి రావడానికి 'చిత్రామ్బలం' అనే తమిళ సినిమా రెడీ అవుతోంది. ధనుశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.