Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో అప్పుడే ఏడుపు స్టార్ట్‌

By:  Tupaki Desk   |   24 July 2019 5:33 AM GMT
బిగ్‌ బాస్‌ లో అప్పుడే ఏడుపు స్టార్ట్‌
X
ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన, ఉత్కంఠతకు తెర లేపిన తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం అయ్యింది. ప్రతి బిగ్‌ బాస్‌ సీజన్‌ లో కూడా పార్టిసిపెంట్స్‌ ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టుకోవడం.. షో కాస్త ఎమోషనల్‌ అవ్వడం జరుగుతూనే ఉంది. అయితే తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం అయిన మూడవ రోజే షో లో హిమజ కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఎలిమినేషన్‌ లో ఉన్న శ్రీముఖి తనను తాను కాపాడుకునే క్రమంలో హిమజను నామినేట్‌ చేసింది.

హిమజను నామినేట్‌ చేసే క్రమంలో ఆమె జీవితంలో చాలా లైట్‌ గా ఉంటుంది... కాని ఇక్కడ మాత్రం చాలా పనులు చేయడంతో పాటు సీరియస్‌ గా ఉన్నట్లుగా అనిపిస్తుందని.. మానిటర్‌ వద్ద మార్కులు కొట్టేసేందుకు చాలా ప్రయత్నాలు చేసిందని అందుకే ఆమెను నామినేట్‌ చేస్తున్నట్లుగా శ్రీముఖి చెప్పుకొచ్చింది. శ్రీముఖి మాటలకు హిమజ సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యింది. నేను లైఫ్‌ ను సీరియస్‌ గా తీసుకోను అంటూ నువ్వు ఎలా చెప్పగలవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను జీవితంలో చాలా కష్టపడి ఈస్థాయికి వచ్చాను. నేను జీవితాన్ని సీరియస్‌ గా తీసుకున్న కనుకే ఇక్కడ వరకు వచ్చాను అంటూ హిమజ అంది. అందుకు శ్రీముఖి సారీ చెప్పింది. ఆ సారీని హిమజ అంగీకరించినట్లుగా చెప్పింది.

ఆ తర్వాత మళ్లీ తాను చేసిన పనిని మానిటర్‌ కు చెప్పడంపై శ్రీముఖి చేసిన వ్యాఖ్యలకు హిమజ కన్నీరు పెట్టుకుంది. తాను ఏదైనా పని చేస్తే దానికి గుర్తింపు ఉండాలని.. తనకు రెడ్‌ మార్క్‌ ఉంది కనుక దాన్ని పోగొట్టుకునేందుకు నేను అలా చెప్పుకోవాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకుంది. హిమజ కన్నీరు పెట్టుకున్నప్పటికి మానిటర్‌ శ్రీముఖిని నామినేషన్‌ నుండి తొలగించి హిమజను పెట్టడం జరిగింది.

ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారు హిమజ, జాఫర్‌, రాహుల్‌, వితిక, పునర్ణవి భూపాలం, హేమ. వీరిలో శని వారం లేదా ఆదివారం ఎవరు బయటకు వెళ్లి పోతారో చూడాలి. ఈ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌ నుండే గొడవలు ప్రారంభం అయ్యాయి. మరి ముందు ముందు మరెంతగా రచ్చ ఉంటుందో చూడాలి.