Begin typing your search above and press return to search.

'బాలయ్య ఎంట్రీతో థియేటర్ దద్దరిల్లిపోద్ది'

By:  Tupaki Desk   |   15 April 2021 7:44 AM GMT
బాలయ్య ఎంట్రీతో థియేటర్ దద్దరిల్లిపోద్ది
X
'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా ''అఖండ''. బాలయ్య ఇందులో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రెండు గెటప్స్ ని చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ముఖ్యంగా అఘోరా గా బాలయ్య ఉగ్రరూపానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక బోయపాటి శ్రీను గత రెండు చిత్రాలకు ధీటుగా నిలిపేలా 'అఖండ' ను తీర్చిదిద్దుతున్నాడని గ్లిమ్స్-టీజర్ లతో అర్థం అవుతోంది. అయితే ఇప్పుడు నటుడు సమ్మెట గాంధీ చెప్పిన విషయాలతో నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

'అఖండ' సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ కోసం బోయపాటి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భారీగా రూపొందించడని మనం ఇది వరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న సమ్మెట గాంధీ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇందులో బాలయ్య ఎంట్రీ సీన్ కి అయితే థియేటర్ మోగిపోతుందని, దద్దరిల్లిపోద్దని.. 'సింహా' 'లెజెండ్' సినిమాల కంటే పెద్ద సక్సెస్ అవుతుందని గాంధీ తెలిపారు. ''అఖండ'' చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ - పూర్ణ నటిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.