Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో మాట్లాడం మానేశానన్న నటి!

By:  Tupaki Desk   |   30 Jan 2019 1:55 PM GMT
త్రివిక్రమ్ తో మాట్లాడం మానేశానన్న నటి!
X
క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బ్రహ్మానందం వైఫ్ పాత్రలో పొట్టచెక్కలేయ్యేలా కామెడీ పండించినా వదిన.. పిన్ని పాత్రల్లో ఎమోషన్స్ పండించినా ఆమెకు ఆమే సాటి. తాజాగా హేమ ఒక వెబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ ప్రోమోనే సంచలనం సృష్టించేలా ఉంది.

త్రివిక్రమ్ గారితో గతంలో కంటిన్యూగా పని చేశారు. ఈమధ్య ఆయన సినిమాలో మీరు కనబడడం లేదు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా అని అడిగితే "నా రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి అతనెవరు? ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మేనేజర్ లేదంటే ప్రొడ్యూసర్. వాళ్ళు చెప్తారు ఇంత ఇవ్వగలం. అంత ఇవ్వలేం అని. ఇన్నేళ్లు మీతో ట్రావెల్ చేసిన మీరు నన్ను నమ్మలేదు.. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయాను. దీంతో ఆయనతో మాట్లాడడం మానేశాను. ఫోన్ చేయడం మానేశాను. అయన ఇలా వస్తుంటే నేను ఇంకో వైపు వెళ్ళిపోయేదాన్ని. అంత కోపం వచ్చింది. కడుపు మండింది." అంటూ సమాధానం ఇచ్చింది.

ఇంతకీ ఆ రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు? త్రివిక్రమేనా.. అందులో హేమకు త్రివిక్రమ్ తో ఏం ఇబ్బంది కలిగింది. ఎందుకు గురూజీతో మాట్లాడడం మానేసింది అనేది ఫుల్ ఇంటర్వ్యూ వస్తేగానీ క్లారిటీ రాదు. ఇక త్రివిక్రమ్ మాత్రమే కాదు. బోయపాటి శ్రీనివాస్ తో జరిగిన మరో సంఘటన గురించి వెల్లడించింది. షూటింగ్ జరిగే సమయంలో "ఏంటి అలా ఏడుపు మొహం పెట్టుకున్నావ్.. ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడులే" అంటూ బోయపాటి తనతో అన్నాడని చెప్పింది.

పూరి జగన్నాధ్ గారితో రిలేషన్ ఎలా ఉంటుందని అడిగితే చాలా బాగుంటుందని చెప్పింది. ఛార్మీ తో రిలేషన్ ఎలా ఉంది అంటే.. ఛార్మీతో తనకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పింది. "జగన్ అనే వాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నాడు. మబ్బులు తొలగిపోగానే ఆ సూర్యుడు బయటకి వస్తాడు" అంటూ పరోక్షంగా స్ట్రాంగ్ కామెంట్ చేసింది. ఆ మబ్బులు ఏంటి? అని అడిగితే "మీరడిగిందే మబ్బు అయి ఉండొచ్చు" అని మరో ఇండైరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. మరి ఫుల్ ఇంటర్వ్యూ వస్తేగానీ హేమ పేల్చిన మాటల తూటాల వెనక అర్థం మనకు అర్థం కాదు.