Begin typing your search above and press return to search.

టెన్ష‌న్ టెన్ష‌న్‌: అభిషేక్ కీ క‌రోనా.. ఐష్‌.. జ‌యాజీకి టెస్టులు

By:  Tupaki Desk   |   12 July 2020 4:00 AM GMT
టెన్ష‌న్ టెన్ష‌న్‌: అభిషేక్ కీ క‌రోనా.. ఐష్‌.. జ‌యాజీకి టెస్టులు
X
క‌రోనా దెబ్బ‌కు సినీప‌రిశ్ర‌మ‌లు అల్లాడుతున్నాయి. సెల‌బ్రిటీల‌కు కొవిడ్ 19 పాజిటివ్ అన్న వార్త‌ల‌తో అభిమానుల్లో ఒక‌టే ఆందోళ‌న నెల‌కొంటోంది. ఉన్న‌ట్టుండి బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఫ్యాన్స్ ఖంగు తిన్నారు. ప్ర‌స్తుతం అమితాబ్ ముంబై నానావ‌తి ఆసుప‌త్రిలో క‌రోనా చికిత్స పొందుతున్నారు. ప‌ది రోజులుగా త‌న‌తో పాటు ఉన్న అంద‌రూ టెస్టులు చేయించుకోవాల్సిందిగా అమితాబ్ ఈ సంద‌ర్భంగా కోరారు.

అంతేకాదు ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రికీ వైద్యులు క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తిచేసారు. ఇందులో అభిషేక్ బ‌చ్చ‌న్ కి కూడా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అత‌డు ఐసోలేష‌న్ లో ఉన్నారు. ఇత‌ర కుటుంబ స‌భ్యులంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని తెలిసింది. బ‌చ్చ‌న్ కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ .. జ‌యాబ‌చ్చ‌న్ ల‌కు అలాగే అమితాబ్ కుమార్తె అల్లుడికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. ఇక తండ్రి కొడుకులిద్ద‌రికీ క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆ ఫ్యామిలీలో కాస్తంత ఆందోళ‌న నెల‌కొంది. ముఖ్యంగా అమితాబ్ (77) ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని క‌ల‌త‌కు గుర‌వుతున్నారు.

ప్ర‌స్తుతం అమితాబ్-అభిషేక్ మిన‌హా ఇత‌ర కుటుంబ స‌భ్యుల టెస్టుల‌కు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ రావాల్సి ఉంది. బ‌చ్చ‌న్ ల‌కు పాజిటివ్ అని తేల‌గానే బాలీవుడ్ లో ఆందోళ‌న నెల‌కొంది. ప్ర‌ధాని మోదీ స‌హా ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు బ‌చ్చ‌న్ లు ఇరువురూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ట్వీట్ చేసారు. ప్ర‌స్తుతం ముంబైని కొవిడ్ అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. అన్ని మెట్రో న‌గ‌రాల్లో సెల‌బ్రిటీలు సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా మ‌హ‌మ్మారీ వెంటాడుతోంది.