Begin typing your search above and press return to search.

గోపీచంద్ ఫోన్ చేసి రూ.10 వేలు అడిగితే మారుతి ఏమన్నాడో చూడండి..!

By:  Tupaki Desk   |   15 Jun 2022 12:30 PM GMT
గోపీచంద్ ఫోన్ చేసి రూ.10 వేలు అడిగితే మారుతి ఏమన్నాడో చూడండి..!
X
'సీటీమార్' సక్సెస్ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన సినిమా ''పక్కా కమర్షియల్''. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

'పక్కా కమర్షియల్' మూవీని 2022 జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరోవైపు చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలు చెబుతూ వస్తున్నారు.

తాజాగా హీరో గోపీచంద్ తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా పక్కా కమర్షియల్ గా సాగిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా ఎవరికైనా కాల్ చేసి రీజన్ చెప్పకుండా రూ. పదివేలు అడగమని యాంకర్ చెప్పగా.. గోపీచంద్ వెంటనే డైరెక్టర్ మారుతి కి ఫోన్ చేశారు.

'మారుతి.. నాకు అర్జెంట్ గా 10 వేలు కావాలి.. ట్రాన్స్ఫర్ చేయగలవా?' అని గోపీచంద్ అడగ్గా.. కాల్ లో ఉన్న మారుతి 'పది వేలా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'పది లక్షలు అన్నట్లు చెప్పారేంటి అన్నా' అని నవ్వుతూ.. వెంటనే గోపీచంద్ అడిగిన అమౌంట్ ను అని పంపించారు.

గోపీచంద్ - మారుతి మధ్య ఫోన్ సంభాషణ నవ్వు తెప్పిస్తుంది. ఈ సందర్భంగా రీజన్ చెప్పకుండా ఐదు లక్షలు అడిగినా మారుతి ట్రాన్స్ఫర్ చేస్తాడు అని గోపీచంద్ చెప్పడంతో వారి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉందో అర్థం అవుతుంది.

'పక్కా కమర్షియల్' సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా ఫిట్ గా కనిపించానంటే.. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు మారుతి మరియు కెమెరామెన్ కరమ్ చావ్లాకే చెందుతుందని గోపీచంద్ అన్నారు.

కథ కచెప్పినప్పుడే 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ చెప్పాడని.. పాటలు - ఫైట్స్ - కామెడీ.. ఇలా కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

కాగా, 'పక్కా కమర్షియల్' సినిమాలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్ - రావు రమేష్ - శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. SKN సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు.