Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో 40 మంది కమెడియన్లా?

By:  Tupaki Desk   |   22 Dec 2015 7:30 PM GMT
ఆ సినిమాలో 40 మంది కమెడియన్లా?
X
తెలుగు సినిమాల్లో కమెడియన్లను మహ బాగా పోషించిన ఘనత జంధ్యాల - ఇ.వి.వి.సత్యనారాయణలదే. వాళ్ల సినిమాల్లో కమెడియన్లే ప్రధాన పాత్రధారులు. ఐదుగురో పదిమందో కాదు.. ఏకంగా 30-40 మంది కమెడియన్లను పెట్టి ఒక్కో సినిమా తీసేవాళ్లు ఈ దర్శకులిద్దరూ. మరే పరిశ్రమలో లేని విధంగా తెలుగులో అంత మంది కమెడియన్లు వర్ధిల్లడానికి వాళ్లిద్దరే కారణం. ఐతే ఆ ఇద్దరూ వెళ్లిపోయాక తెలుగులో కమెడియన్లకు పని తగ్గిపోయింది.

ఇప్పటి దర్శకులు ఒకరిద్దరు కమెడియన్లతో నెట్టుకొచ్చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లలో కమెడియన్ల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది ‘లౌక్యం’ సినిమాలో కమెడియన్లు చాలామందే కనిపించారు. అందరూ నవ్వించారు. తాజాగా ‘సౌఖ్యం’ సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. దీంతో ఏకంగా 40 మంది కమెడియన్లున్నారని చెబుతున్నాడు డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

ఈ 40 మందిలో చాలామందికి మంచి పాత్రలు పడ్డాయని.. ప్రతి ఒక్కరూ నవ్వించడానికే ప్రయత్నం చేశారని.. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని చెప్పాడు చౌదరి. పృథ్వీ - బ్రహ్మానందంల పాత్రలు బాగా హైలైట్ అవుతాయని.. ఐతే కమెడియన్ల కంటే కూడా గోపీచందే అందరి కంటే ఎక్కువగా నవ్విస్తాడని చెప్పాడతను. ఇయర్ ఎండింగ్‌ లో రాబోతున్న హోల్ సం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. గోపీచంద్ - తన కాంబినేషన్ లో వచ్చిన ‘యజ్నం’ కంటే ఇది పెద్ద హిట్టవుతుందని చౌదరి ధీమా వ్యక్తం చేశాడు