Begin typing your search above and press return to search.

అనుష్క.. బాహుబలి తరువాత మళ్ళీ ఇలా..

పాన్ ఇండియా మార్కెట్లో పర్ఫెక్ట్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లో అనుష్క శెట్టి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   8 April 2024 4:03 AM GMT
అనుష్క.. బాహుబలి తరువాత మళ్ళీ ఇలా..
X

పాన్ ఇండియా మార్కెట్లో పర్ఫెక్ట్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లో అనుష్క శెట్టి టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. బాహుబలి సినిమాతో ప్రభాస్ తో పాటు ఆమెకు కూడా అదే తరహాలో క్రేజ్ అయితే వచ్చింది. అయితే అనుష్క ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఏది పడితే అది ఓకే చేయలేదు. కేవలం కంటెంట్ ఉన్న మంచి కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

పారితోషకం విషయంలో కూడా ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ముందుగా కథ క్యారెక్టర్ నచ్చితేనే ఎవరితో అయినా వర్క్ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె లైనప్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అనుష్క శెట్టి ప్రస్తుతం మలయాళంలో కథానార్ ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తోంది. హిస్టారికల్ నేపథ్యం ఉన్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.

ఇక అనుష్క మరోవైపు క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఘాటీ అనే ఆ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా మొదలైపోయింది. దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరిహర వీరమల్లు ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టి మరి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా ఆసక్తిని కలిగించింది.

అందులో ముసుగులో నడుచుకుంటూ వెళుతున్న మహిళగా అనుష్క కనిపించింది. పూర్తి స్థాయిలో ఆమె ఫేస్ రివీల్ చేయకపోయినప్పటికీ ఆ పాత్రలో మాత్రం చాలా బికారంగా కనిపించబోతున్నట్లుగా అర్థమవుతోంది. అయితే ఆమె దాదాపు ఆరు పదుల వయసున్న మహిళగా అందులో కనిపించబోతుందట.

గతంలో బాహుబలి సినిమాలో కూడా అనుష్క యువరాణి దేవసేన గా కనిపించి మళ్లీ ఆ తర్వాత వయసు పైబడిన మహిళగా కూడా కనిపించింది. బల్లాలదేవ చెరసాలలో ఖైదీగా ఆమె ఎంత కోపంగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ఘాటీ సినిమాలో అనుష్క దాదాపు అదే తరహా షేడ్ లో ఎక్కువగా కనిపించబోతోంది. అన్యాయం చేసిన వారిపై తనలోని కోపాన్ని కూడా చాలా కటినంగా చూపిస్తుందట. క్యారెక్టర్ లైఫ్ జర్నీలో అనుష్క మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అన్యాయానికి గురైన ఒక సాధారణ మహిళ న్యాయం కోసం ఎలా పోరాడింది అనే పాయింట్ తో నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది ఇక మిగిలిన షూటింగ్ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసే సినిమా విడుదల డేట్ పై క్లారిటీ ఇవ్వబోతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.