అనుపమని పట్టించుకోరేంటి..?
అదేంటి ఎందుకలా అంటే.. కెరీర్ మొదట్లోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉంటే ఛాన్స్ లు రావట్లేదని సన్నగా మారింది
By: Tupaki Desk | 23 April 2025 12:30 AMఅందాల అనుపమని టాలీవుడ్ లో పట్టించుకునే వారు కరువయ్యారు. అదేంటి ఎందుకలా అంటే.. కెరీర్ మొదట్లోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉంటే ఛాన్స్ లు రావట్లేదని సన్నగా మారింది. అనుపమలోని ఈ మేకోవర్స్ కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చినా కొంతమందికి మాత్రం రుచించలేదు. అయినా సరే ఒకసారి ఇష్టపడ్డాక తప్పదు కదా అనుకుంటూ ఆమెని అభిమానిస్తూ వచ్చారు. అదేంటో అందం అభినయం రెండు ఉన్నా కూడా అంపమకి లక్ కలిసి రాలేదు. తెలుగులో సినిమాలు చేసినా కూడా స్టార్ స్టేటస్ అందుకోలేదు.
కెరీర్ లో సినిమాలు పడుతున్నా కొద్దీ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకోవాలి. కానీ అమ్మడి గ్రాఫ్ పడిపోతూ యువ హీరోలతో నటించే పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ ఆ సినిమాలు కూడా పాపులారిటీ తెచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అనుపమ మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేదు. లాస్ట్ ఇయర్ తెలుగులో ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేసింది అమ్మడు. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ పడినా కూడా అమ్మడికి తర్వాత పెద్దగా ఛాన్స్ లు రాలేదు.
ప్రస్తుతం అమ్మడు పరదా సినిమా చేస్తుంది. ఆ సినిమా టీజర్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేశారు. ఇక మరోపక్క కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ తో బిసన్ అనే సినిమా చేస్తుంది అమ్మడు. లాక్ డౌన్ అనే సినిమా కూడా చేస్తుంది అనుపమ. మలయాళంలో కూడా పెట్ డిటెక్టివ్ సినిమా చేస్తుంది అనుపమ. దానితో పాటు జె.ఎస్.కె ట్రూత్ షల్ ఆల్వేస్ అనే సినిమా చేస్తుంది.
తమిళ, మళయాళ భాషల్లో పర్వాలేదు కానీ తెలుగులో మాత్రం అనుపమని పట్టించుకోవత్లేదు. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్ అందుకుంది అనుపమ పరమేశ్వరన్. ఐతే టాలీవుడ్ లో అమ్మడికి ఛాన్స్ లు రాకపోవడానికి కారణం ఏంటన్నది తెలియట్లేదు. ఏది ఏమైనా అనుపమ విషయంలో తెలుగు మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారు అన్నది తెలియదు కానీ అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఆమెను మరిన్ని సినిమాల్లో చూడాలని కోరుతున్నారు. ఈమధ్య ధృవ్ తో ఆమె కిస్సింగ్ ఫోటో ఒకటి వైరల్ కాగా అది సినిమాలోది అంటూ హడావుడి చేసినా అసలు విషయం ఏంటన్నది మాత్రం తెలియలేదు. ఐతే కోలీవుడ్ లో మాత్రం అనుపమ వరుస ఛాన్స్ లతో అదరగొట్టేస్తుంది.