Begin typing your search above and press return to search.

మరో హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్.. షాకింగ్

టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది కానీ.. ఈ క్రమంలో యువతను చెడు త్రోవ పట్టించే టెక్నాలజీ కూడా మరింత భయాన్ని కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:42 AM GMT
మరో హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్.. షాకింగ్
X

టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది కానీ.. ఈ క్రమంలో యువతను చెడు త్రోవ పట్టించే టెక్నాలజీ కూడా మరింత భయాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో రకాల ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీ తో వీడియోలు భయాన్ని కలిగించేలా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే రోజురోజుకు వీటి తీవ్రత ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో అనే విధంగా కూడా ఆందోళనను కలిగిస్తోంది.

ఇటీవల రష్మిక మందన ఫేస్ తో క్రియేట్ చేసిన ఒక డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. వెంటనే కేసులు నమోదు చేసి అందుకు కారణమైన వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరి కొంతమంది సెలబ్రిటీలు సూచిస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ జరిగే తప్పులు జరుగుతూనే ఉన్నాయి అని మరొక ఘటనతో అర్థమవుతుంది. రష్మిక మందన ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు తరహాలోనే ఇప్పుడు మరొక హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతుంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో ఊహించిన విధంగా సోషల్ మీడియాలో గత కొన్ని గంటలుగా చక్కర్లు కొడుతోంది.

మొన్ననే కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి వీడియోలతో చాలా ఇబ్బంది పడ్డారు అని అర్థమైంది. తప్పనిసరిగా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రభుత్వాలు సీరియస్ గా స్పందించినప్పటికీ కూడా మళ్లీ మరొక హీరోయిన్ ఫేస్ తో ఈ విధంగా వీడియోలు వైరల్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తులో మళ్లీ ఇంకా ఎలాంటి వీడియోలు వస్తాయో అని కూడా కొందరిలో ఆందోళనను కలిగిస్తోంది.

కేవలం సెలబ్రెటీలు మాత్రమే కాకుండా సాధారణ మహిళలు కూడా ఈ డిప్ ఫేక్ టెక్నాలజీ కారణంగా చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ అలాగే మరికొందరు సినిమా హీరోయిన్స్ టెక్నీషియన్స్ కూడా ఈ తరహా టెక్నాలజీపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.