Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ మాటున మరో రచ్చ... తెరపైకి చీటింగ్!

ఇందులో భాగంగా గ్రాండ్ ఫినాలే అనంతరం కొందరు ఆకతాయిల రచ్చ రచ్చ చేయడం.. పలు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేయడం చేశారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 5:41 AM GMT
బిగ్  బాస్  మాటున  మరో రచ్చ... తెరపైకి చీటింగ్!
X

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ కూడా ఆ షో ఫ్యాన్స్ ని బాగానే ఎంటర్‌ టైన్‌ చేసింది! అదే సమయంలో బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ లో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో ఎదుట, అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ సైడ్ ఉండే కృష్ణానగర్ బస్టాప్ వద్ద జరిగిన రచ్చ ఎలాంటి పరిస్థితులకు దారితీసిందనేది తెలిసిందే.

ఇందులో భాగంగా గ్రాండ్ ఫినాలే అనంతరం కొందరు ఆకతాయిల రచ్చ రచ్చ చేయడం.. పలు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేయడం చేశారు. ఈ సమయంలో... ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ పై కేసులు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. అనంతరం బెయిల్‌ పై బయటకు వచ్చాడు. ఇలా సీజన్ నడుస్తున్నప్పటికంటే.. ముగిసిన అనంతరం వార్తల్లో బలంగా నానింది ఈ బిగ్ బాస్ ఏడో సీజన్!

ఆ సంగతి అలా ఉంటే... ప్రధాన మీడియాల్లో వస్తున్న కథనాల ప్రకారం... బిగ్‌ బాస్‌ పేరుతో చీటింగ్‌ వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను బిగ్‌ బాస్‌ లోకి పంపిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ యాంకర్‌ స్వప్న చౌదరి తెరపైకి వచ్చారని తెలుస్తుంది. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

వివరాళ్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న.. యాంకర్‌ గా, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ గా టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. “మిస్టరీ”, “నమస్తే సేట్‌ జీ” అనే సినిమాల్లోనూ నటించింది. అయితే బిగ్‌ బాస్‌ సీజన్ 1 ప్రారంభమైనప్పటి నుంచి ఈ సెలబ్రిటీ గేం షోకి ఆమె వెళ్లాలనుకుంటుందంట. ఈ ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ లోకి కంటెస్టెంట్‌ గా పంపిస్తానని చెప్పి ఒక వ్యక్తి రూ. 2.50 లక్షలు తీసుకున్నాడని ఆమె ఒక వీడియో రిలీజ్‌ చేసిందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... తనకు బిగ్ బాస్‌ కి వెళ్లడం అంటే చాలా ఇష్టమని, నిద్రపోతున్న సమయంలోనూ బిగ్‌ బాస్‌ లో ఉన్నట్లు ఊహించుకుంటానని, బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూస్తున్నానని తెలిపారు. ఈ సమయంలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 సమయంలోనూ తనను కంటెస్టెంట్‌ గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి తన దగ్గర రూ.2.50 లక్షలు తీసుకున్నాడని ఆమె తెలిపారు.

ఆ డబ్బుతో ఫొటో షూట్‌ కోసం మరో పాతిక వేలు తీసుకున్నాడని.. ఆ సమయంలో తనకొక అగ్రిమెంట్‌ కూడా రాసిచ్చాడని ఆమె తెలిపారు. అయితే చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడని.. బిగ్‌ బాస్‌ కు పంపించలేకపోతే డిసెంబర్‌ లో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడని.. అయితే ఇప్పుడు మాత్రం సరిగా స్పందించడం లేదని చెబుతూ ఆమె ఆవేదన వ్యక్తి చేసింది! దీంతో బిగ్ బాస్ మరో సారి హాట్ టాపిక్ గా మారింది!