Begin typing your search above and press return to search.

యానిమల్ పార్క్!.. జనాలు తట్టుకోగలరా?

ఈ పాజిటివ్ టాక్ కారణంగా ఈ వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ నమోదు కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:08 AM GMT
యానిమల్ పార్క్!..  జనాలు తట్టుకోగలరా?
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన యానిమల్ మూవీకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. సందీప్ రెడ్డి మేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ యానిమల్ మూవీని ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఈ పాజిటివ్ టాక్ కారణంగా ఈ వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ నమోదు కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

మొదటి రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రణబీర్ కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. మూవీలో తండ్రి, కొడుకుల ఎమోషన్స్ ని సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. అలాగే చిన్న వయస్సు నుంచి ఎక్స్ పెక్ట్ చేసే ప్రేమ దొరకకపోతే ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తారో అనేది రణబీర్ పాత్రతో చూపించాడు.

మొత్తానికి సందీప్ రెడ్డి యానిమల్ తో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టడంతో పాటు కకెరియర్ పరంగా హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నట్లు అయ్యింది. ప్రేక్షకుల స్పందన ఇదే స్థాయిలో కొనసాగితే ఈ ఏడాది బాలీవుడ్ లో మరో హైయెస్ట్ కలెక్షన్స్ టేకర్ గా యానిమల్ నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ స్కోప్ ఉందా అంటే ఉందనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమాతో రణబీర్ కపూర్ ఒక సీక్వెల్ ని రెడీ చేసుకున్నారు. ఇప్పుడు యానిమల్ మూవీతో మరో సీక్వెల్ సినిమా అతని లైన్ లోకి వచ్చిందని బాలీవుడ్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా లో యానిమల్ పార్క్ అంటూ ఒక టైటిల్ క్రియేట్ చేసి విలన్ బాబీ డియోల్ ని పరిచయం చేశారు. ఈ యానిమల్ పార్క్ కి భాగానే ఎస్టాబ్లిష్ చేశారు.

అలాగే యానిమాల్ పార్క్ అనే టైటిల్ ని కూడా మూవీ ఎండ్ లో ప్రెజెంట్ చేశారు. దీనిని బట్టి సీక్వెల్ స్టొరీ చేయడానికి కావాల్సినంత స్కోప్ యానిమల్ కి ఉందని ఆడియన్స్ కి అర్ధమైంది. అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా సీక్వెల్ కి డైరెక్ట్ గానే హింట్ ఇచ్చాడు. ఇక యానిమాల్ ఏండింగ్ లో ఏమోషన్ కంటే ఎక్కువ స్థాయిలో లిమిట్స్ లేకుండా రక్తపాతం చూపించారు. ఇక సీక్వెల్ లో ఆ డోస్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.