Begin typing your search above and press return to search.

'ఓయ్' దర్శకుడు.. అంతా తిట్టినా కూడా..

డైరెక్టర్ రిప్లైకు షాక్‌ అయిన ఆ నెటిజన్‌.. 'గుండు అని పిలిచినందుకు సారీ సార్' అని క్షమాపణలు కోరాడు. దీంతో ఆయన "ఏం ఫర్వాలేదు. మీరు అన్నది నిజమే" అని సమాధానమిచ్చారు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 2:34 PM GMT
ఓయ్ దర్శకుడు.. అంతా తిట్టినా కూడా..
X

ప్రస్తుతం టాలీవుడ్‌‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది ఓయ్ మూవీ. బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా ఆనంద్ రంగా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా, ఇప్పుడు కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది.

అందుకే ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని వాలెంటైన్స్ డే స్పెషల్‌ గా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో చాలా కాలంగా ఆఫ్లైన్ లో ఉన్న దర్శకుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. అయితే తన సినిమా రీ-రిలీజ్ విషయాన్ని పంచుకున్న ఆయనకు ఓ అనుకోని అనుభవం ఎదురైంది.

ఓయ్‌ సినిమా ఈ నెల 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలియజేస్తూ ట్వీట్ రూపంలో తన ఆనందాన్ని పంచుకున్నారు ఆనంద్ రంగా. ఎప్పటి నుంచో ఈ మూవీ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నెటిజన్లంతా ఆయన ట్వీట్ పై స్పందించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ కాస్త మితిమీరి ప్రవర్తించాడు.

"ఒరేయ్ గుండు నాయాలా.. ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు వెళ్లిపోయావ్‌ రా" అని కామెంట్ చేశాడు. దీనికి దర్శకుడు వెంటనే స్పందిస్తూ స్మైలీ ఎమోజీని పోస్ట్‌ చేశారు. డైరెక్టర్ రిప్లైకు షాక్‌ అయిన ఆ నెటిజన్‌.. 'గుండు అని పిలిచినందుకు సారీ సార్' అని క్షమాపణలు కోరాడు. దీంతో ఆయన "ఏం ఫర్వాలేదు. మీరు అన్నది నిజమే" అని సమాధానమిచ్చారు. దీంతో ఈ కన్వర్జేషన్ ఫుల్ వైరల్ గా మారింది.

"మిమ్మల్ని గుండు గారు అని పిలవచ్చా?" అని మరో నెటిజన్ అడగ్గా.. 'మీ ఇష్టం' అంటూ రిప్లై ఇచ్చారు ఆనంద్ రంగా. మాములుగా సోషల్‌ మీడియాలో కొందరు నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తుంటారని సెలబ్రిటీలు ఎవరూ నెటిజన్లకు పెద్దగా రిప్లై ఇవ్వరు. అయితే ఆనంద్ రంగా మాత్రం అన్నిటికీ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. గుండు నాయాలా లేటెస్ట్ పిక్ అంటూ ఫొటో కూడా షేర్ చేశారు. ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నానని చెప్పిన ఆయన.. కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.