Begin typing your search above and press return to search.

అమితాబ్ తర్వాత మహేష్‌.. ఇప్పుడు ఆ ఇద్దరు!

మహేష్ బాబుతో పాటు మరి కొందరు స్టార్స్ సినిమాలతో ఎంతగా సంపాదిస్తున్నారో అదే స్థాయిలో కమర్షియల్‌ యాడ్స్ లో నటించడం ద్వారా సంపాదిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 7:30 AM GMT
అమితాబ్ తర్వాత మహేష్‌.. ఇప్పుడు ఆ ఇద్దరు!
X

స్టార్‌ హీరోలు తమ ఇమేజ్ ను ఉపయోగించుకుని నాలుగు చేతుల సంపాదించేస్తున్నారు. తమకు ఉన్న ఇమేజ్ ని బట్టి ఒక్కో కమర్షియల్ కి కోట్లకు పైగా పారితోషికం వసూళ్లు చేస్తున్నారు. మహేష్ బాబుతో పాటు మరి కొందరు స్టార్స్ సినిమాలతో ఎంతగా సంపాదిస్తున్నారో అదే స్థాయిలో కమర్షియల్‌ యాడ్స్ లో నటించడం ద్వారా సంపాదిస్తున్నారు.

యూపీఐ పేమెంట్స్ చేసిన సమయంలో అమితాబచ్చన్‌ వాయిస్ చాలా చోట్ల వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు పోన్‌ పే వారు అదే తరహా లో మహేష్ బాబు వాయిస్ ను తెలుగు రాష్ట్రాల్లో పోన్‌ పే చెల్లింపులకు వినియోగించబోతున్నారు. చెల్లింపుల సమయంలో మహేష్ బాబు వాయిస్‌ తో డబ్బు రిసీవ్ చేసుకున్నట్లుగా రాబోతుంది.

పోన్‌ పే స్పీకర్‌ లో తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు వాయిస్‌ వినిపించనుండగా, కన్నడం లో కిచ్చా సుదీప్‌ మరియు కేరళలో మమ్ముట్టీ వాయిస్‌ ను వినిపించబోతున్నారు. పోన్‌ పే వారు భారీ మొత్తం పారితోషికం చెల్లించి ఈ ముగ్గురు స్టార్స్ తో ఒప్పందాలు చేసుకుంది.

ఒకప్పుడు అమితాబచ్చన్ వాయిస్ మాత్రమే చెల్లింపు స్పీకర్ లో వినిపించేది. ఆ తర్వాత మహేష్ బాబు వాయిస్‌ ఇప్పుడు కిచ్చా సుదీప్‌ ఇంకా మమ్ముట్టీ వాయిస్ ను కూడా పోన్ పే వినిపించబోతుంది. ముందు ముందు మరెన్ని రకాలుగా మన స్టార్స్ ను కమర్షియల్స్ లో చూస్తామో..!