Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD: బచ్చన్ సాబ్ కి ఎంతిచ్చారో తెలుసా..

ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   22 April 2024 1:50 PM GMT
కల్కి 2898 AD: బచ్చన్ సాబ్ కి ఎంతిచ్చారో తెలుసా..
X

ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకుంటుంది అని మేకర్స్ ఇప్పటికే చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే నిర్మాత అశ్విని దత్ ప్రత్యేకంగా రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. ఇకనుంచి గ్యాప్ లేకుండా పోస్టర్లు టీజర్లు సాంగ్స్ అంటూ కల్కి టీం హడావిడి క్రియేట్ చేయబోతోంది.

ఇన్ని రోజులు ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ నుంచి అయితే కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలా స్లోగా ఉన్నారు అని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మేకర్స్ మొత్తానికి స్పీడ్ పెంచేశారు. ఇక రీసెంట్ గా అమితాబచ్చన్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ సినిమాలో అశ్వద్ధామ గా కనిపించబోతున్నాడు.

గ్రాఫిక్స్ లో ఆయనను యంగ్ గా చూపించిన విధానం కూడా హైలెట్ అవుతోంది. తప్పకుండా ఆ క్యారెక్టర్ సినిమాలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే భావన కలిగించారు. ఇక నార్త్ లో కూడా కల్కి సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటోంది. అయితే ఇంతకీ అమితాబ్ బచ్చన్ కు ఈ పాత్ర చేయడానికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

గతంలోనే ఏ విషయంలో చాలా రకాల గాసిప్స్ వినిపించాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం అమితాబ్ బచ్చన్ ఈ సినిమా కోసం మొత్తంగా 18 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా 45 రోజుల కంటే తక్కువ కాల్షీట్స్ కే అయినా ఈ స్థాయిలో ఛార్జ్ చేసినట్లు సమాచారం. అమితాబచ్చన్ ఎనిమిది పదుల వయసు దాటినా కూడా ఇంకా చాలా యాక్టివ్ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.

ఇక కల్కి సినిమాలో కూడా ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కమలహాసన్ కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక దాదాపు 600 కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. నిర్మాత అశ్విని దత్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. ఇక రెండు భాగాలుగా సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.