Begin typing your search above and press return to search.

నా పక్కన అలాంటి వ్యక్తి ఉంటే బాగుండేది

తాజాగా ఒక చిట్ చాట్‌ లో అమలా పాల్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   30 Aug 2023 8:52 AM GMT
నా పక్కన అలాంటి వ్యక్తి ఉంటే బాగుండేది
X

మైనా సినిమా తో సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకుల మరియు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ అమలా పాల్. ఈ అమ్మడు తెలుగు లో నాగ చైతన్య హీరోగా నటించిన బెజవాడ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు లో పలు సినిమా ల్లో నటించి మెప్పించింది. అయితే వ్యక్తిగత విషయాల కారణంగా అమలా పాల్‌ టాలీవుడ్ లో అవకాశాలు కోల్పోయింది.

దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని విడిపోయిన సమయంలో కెరీర్‌ పరంగా కాస్త ఇబ్బంది ఎదుర్కొంది. విడాకుల తర్వాత కెరీర్‌ లో మరింత దూసుకు పోవాలని కష్టపడింది. కానీ తమిళ సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయింది. కొన్ని మలయాళ మరియు హిందీ సినిమాలు చేసినా అవి పెద్దగా ప్రభావం చూపించడంలో విఫలం అయ్యాయి.

తాజాగా ఒక చిట్ చాట్‌ లో అమలా పాల్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్స్ లేరని, అలాంటి వారు ఉండి ఉంటే తన కెరీర్ అందరి మాదిరిగా చాలా సంతోషంగా ఉండేదని చెప్పుకొచ్చింది. నా పక్కన అలాంటి ఒక వ్యక్తి ఉండి ఉంటే బాగుండేదని నేను అనుకుంటాను అంటూ అమలా పాల్ పేర్కొంది.

మైనా సినిమా తర్వాత నేను మానసిక సంఘర్షణ కు గురి అయ్యాను. ఆ సమయంలో నా కంటే ఎక్కువగా అమ్మ బాధ పడ్డారు. నేను జీవితంలో మోస పోయాను అనడం కంటే మోసగించబడ్డాను అంటే కరెక్ట్‌ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. కరోనా సమయంలో కూడా మానసిక సంఘర్షణ కి గురి అయ్యాను. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాధపడేదాన్ని అంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు రెండు వెబ్‌ సిరీస్‌ ల చర్చలు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి విడాకుల తర్వాత అమలా పాల్ మెల్ల మెల్లగా బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక ధనుష్ 50వ సినిమా లో నటిస్తున్న నేపథ్యంలో మరోసారి ఈమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.