Begin typing your search above and press return to search.

బన్నీ మైనపు విగ్రహం కిర్రాక్.. పక్కనే అర్హ అల్లరి!

మార్చి 28వ తేదీ రాత్రి జరిగిన బన్నీ విగ్రహ లాంఛింగ్ వీడియోను ఆయనే తన సోషల్ మీడియాలో షేర్ చేశారు

By:  Tupaki Desk   |   29 March 2024 4:39 AM GMT
బన్నీ మైనపు విగ్రహం కిర్రాక్.. పక్కనే అర్హ అల్లరి!
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం విదేశాల్లో కూడా మార్మోగిపోతోంది. ఇప్పటికే పుష్ప మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఫేమస్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 28వ తేదీ రాత్రి జరిగిన బన్నీ విగ్రహ లాంఛింగ్ వీడియోను ఆయనే తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీ అలవైకుంఠపురంలో కాస్ట్యూమ్‌ తో పుష్ప తగ్గేదేలే మేనరిజంతో బన్నీ మైనపు విగ్రహం ఉండటం విశేషం. ఇక అల్లు అర్జున్.. తన మైనపు విగ్రహంతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తగ్గేదేలే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఫోటోల్లో బన్నీకి, ఆయన మైనపు విగ్రహానికి ఏ మాత్రం కూడా తేడా లేదు. డ్రెస్సింగ్, గడ్డం, జట్టు అంతా ఒకేలా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. తగ్గేదేలే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే మైనపు విగ్రహం లాంఛ్ సమయంలో బన్నీ కుమార్తె అల్లు అర్హ సందడి మామూలుగా లేదు.

తన తండ్రి విగ్రహం పక్కన నిల్చుని తగ్గేదేలే అంటూ స్టిల్ ఇచ్చింది అర్హ. ఆ తర్వాత పుష్ప హుక్ స్టెప్ వేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం అర్హ క్యూట్ డ్యాన్స్ వీడియోస్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక బన్నీ తన విగ్రహ ఆవిష్కరణకు ముందు కూడా పోస్ట్ పెట్టారు. ప్రతి నటుడికి మైల్ స్టోన్ మూమెంట్ అంటూ రాసుకొచ్చారు. బన్నీ మైనపు విగ్రహ తయారీకి నాలుగు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రపంచంలోని వివిధ నగరాల్లో ఉన్న మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియాల్లో మన తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. అయితే వారిద్దరి విగ్రహాలు లండన్‌ మ్యూజియంలో ఉండగా.. బన్నీది దుబాయ్ లో ఆవిష్కరించారు. ఇటీవల కాజల్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. దక్షిణాది తొలి నటిగా కాజల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్టు చేయనున్న బన్నీ మధ్యలో త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అట్లీ తో కూడా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.