Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ త‌ర్వాత పుష్ప‌రాజ్‌పై క‌న్ను?

ఇప్పుడు కృతి స‌డెన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి క‌నిపించింది. ఈ వేదిక వ‌ద్ద అల్లూతో ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోయి క‌నిపించిన కృతిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వేడెక్కించాయి.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:52 AM GMT
ఆదిపురుష్ త‌ర్వాత పుష్ప‌రాజ్‌పై క‌న్ను?
X

'ఆదిపురుష్'లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించింది కృతి స‌న‌న్. రాఘ‌వుని భార్య‌ సీత‌గా న‌టించింది. ఆ సినిమా జ‌యాప‌జ‌యాల సంగ‌తి ఎలా ఉన్నా ఈ జంట మ‌ధ్య ఆఫ్ ద స్క్రీన్ అన్యోన్య‌త స‌ర్వ‌త్రా గుస‌గుస‌ల‌కు తావిచ్చింది. ఇప్పుడు కృతి స‌డెన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి క‌నిపించింది. ఈ వేదిక వ‌ద్ద అల్లూతో ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోయి క‌నిపించిన కృతిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వేడెక్కించాయి. అస‌లింత‌కీ ఈ బాండింగ్ దేనికోసం? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

నిజానికి ఈ ఇద్ద‌రూ ఒకే కార‌ణంతో ఓ చోట క‌లిసారు. అందుకు దిల్లీ వేదిక అయింది. జాతీయ అవార్డులు వారిద్దరినీ క‌లిపాయ‌ని చెప్పాలి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలుగా అల్లు అర్జున్ - కృతి సనన్ ఒకే వేదిక వ‌ద్ద సంద‌డి చేసారు. దిల్లీలో పుర‌స్కారాల వేదిక వ‌ద్ద ఎంతో స‌న్నిహితులుగా మారారు. విజ్ఞాన్ భ‌వన్- దిల్లీ వేదిక‌గా అవార్డుల వేడుకలో కృతి సనన్ - అల్లు అర్జున్ బంధం హృదయాలను గెలుచుకుంది. బాలీవుడ్ బ్యూటీతో పుష్ప రాజ్ చాలా ఎక్కువ స‌మ‌యం సంభాషణల్లో మునిగిపోయారు. ఈ దృశ్యం చూడ‌గానే కృతికి టాలీవుడ్ అంటే ఇష్టమైనదని రుజువు అయింది. ప్రభాస్ తర్వాత, అల్లు అర్జున్ ఈ భామ‌తో చాలా సౌకర్యంగా ఉండటం మాట్లాడటం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

సాధారణంగా సౌత్ స్టార్స్ సిగ్గుపడతారు. ప్రభాస్ ఒక క్లాసిక్ ఉదాహరణ. కానీ కృతితో అతని బంధం వేరు. అన్నిర‌కాలా సిగ్గు విడిచి త‌న‌తో క‌లిసిపోయాడు. కరణ్ జోహార్ -కాఫీ విత్ కరణ్ 7 షోలోని ఒక‌ టాస్క్‌లో కృతి స‌న‌న్ వెంటనే పాయింట్‌లను గెలుచుకోవడానికి ప్రభాస్‌కు ఫోన్ చేసిన విష‌యం మనమందరం చూశాం. 'హే కరణ్, ఇట్స్ మి' విభాగంలో ఈ సీన్ క‌న‌బ‌డ‌గా.. వారిద్ద‌రి మ‌ధ్యా రిలేష‌న్ షిప్ పై పుకార్లు హెడ్ లైన్స్ లోకొచ్చాయి. అయితే కృతి మాట్లాడుతూ.. మేమిద్ద‌రం మంచి స్నేహితులమని ప్ర‌క‌టించ‌గా అన్ని ఊహాగానాలకు తెరపడింది.

69వ జాతీయ అవార్డుల విజేతల వేడుకలో కృతి సనన్ తన అందంతో హెడ్ ట‌ర్న‌ర్ గా నిలిచింది. ఇదే వేదిక వ‌ద్ద అల్లు అర్జున్ వైట్ బ్లేజ‌ర్ లో ఎంతో స్మార్ట్ గా క‌నిపించారు. ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు ముచ్చ‌టించుకుంటున్న‌ప్పుడు ఆ దృశ్యం కన్నుల పండుగ‌ను త‌ల‌పించింది. RRR, పుష్ప స‌హా ఇతర తెలుగు చిత్రాల బృందాలు సన్మానాలు అందుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ ఫోన్ లోనే ఫోటోలు తీస్తూ, వీడియోలను క్లిక్ చేస్తూ క‌నిపించాడు. ప‌క్క‌నే ఉన్న‌ కృతి అతడికి కొన్ని చిట్కాలు ఇస్తున్నట్లు అనిపించింది. వేడుక అంతటా ఇద్దరూ బాగా క‌లిసిపోయి క‌నిపించారు. కంటిన్యూగా మాట్లాడుకోవడం కనిపించింది. ఆ ఇద్ద‌రి ముఖాల్లో మొట్టమొదటి జాతీయ అవార్డు పొందిన ఆనందం ఉత్సాహం స్పష్టంగా కనిపించాయి. వారు తమ తోటి జాతీయ అవార్డు గ్రహీతలైన SS రాజమౌళి (ఆర్.ఆర్.ఆర్ ఉత్త‌మ జ‌నాద‌ర‌ణ చిత్రం), R. మాధవన్ (రాకెట్రీ)ల వెనుక ఒక వరుసలో కూర్చున్నారు.

ఈ వేడుక‌లో అంద‌రి క‌ళ్లు బ‌న్ని-కృతి జంట‌పైనే. ఆదిపురుష్ త‌ర్వాత పుష్ప‌రాజ్ తో కృతి సినిమా చేస్తుందా? అంటూ ఊహాగానాలు సాగాయి. కృతి స‌నోన్ న‌టించిన సినిమాలు ఫ్లాప‌వ్వొచ్చు. కానీ కృతి న‌టిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. 1-నేనొక్క‌డినే నుంచి ఇది తెలిసిన విష‌య‌మే. ఆదిపురుష్ లోను కృతి బాగానే న‌టించినా ద‌ర్శ‌కుడి ఫెయిల్యూర్ అంద‌రికీ ఆపాదించ‌బ‌డింది. ఇప్పుడు పుష్ప 2లో న‌టిస్తున్న బ‌న్నీతో కృతి ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోయింది. ఇది కొత్త స‌మీక‌ర‌ణానికి దారి తీస్తుందేమో చూడాలి. మునుముందు బ‌న్ని త‌న‌కో ఆఫ‌ర్ ఇస్తాడ‌నే అంతా భావిస్తున్నారు. ఇప్ప‌టికి అభిమానులు వారి బంధానికి విస్మయం చెందారు. కలిసి ఒక చిత్రం చేయాల‌ని కోరుకుంటున్నారు. అయితే దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. విజ్ఞాన్ భ‌వన్- దిల్లీ వేదిక‌గా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల‌మీదుగా కృతి, బ‌న్ని అవార్డులు అందుకోనున్నారు.