Begin typing your search above and press return to search.

బాలీవుడ్- టాలీవుడ్ బ్ర‌ద‌ర్స్ టైపు!

జాతీయ అవార్డు గ్ర‌హీత‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న వ్యాఖ్య‌తో అటు బాలీవుడ్ ప్ర‌ముఖుల దృష్టిని ఆక‌ర్షించాడు.

By:  Tupaki Desk   |   15 March 2024 8:12 AM GMT
బాలీవుడ్- టాలీవుడ్ బ్ర‌ద‌ర్స్ టైపు!
X

``భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బాలీవుడ్, టాలీవుడ్ అన్న‌ద‌మ్ముల త‌ర‌హా`` అని వ్యాఖ్యానించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. త‌ద్వారా త‌న‌లోని సోద‌ర‌భావాన్ని ప్ర‌క‌టించాడు. సౌత్ - నార్త్ డిబేట్ నేప‌థ్యంలో దేశంలోని ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ వ్యాఖ్య ఇప్పుడు ఫిలింస‌ర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.

జాతీయ అవార్డు గ్ర‌హీత‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న వ్యాఖ్య‌తో అటు బాలీవుడ్ ప్ర‌ముఖుల దృష్టిని ఆక‌ర్షించాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో అల్లు హీరో బాలీవుడ్ తో పోలుస్తూ, దక్షిణ భారత సినిమా ఎదుగుద‌ల డామినేష‌న్ గురించి జ‌రుగుతున్న‌ చర్చను ఉఠంకించారు. త‌న‌కు టాలీవుడ్..బాలీవుడ్ అనే తేడా లేదు.

బాలీవుడ్ అంటే అపారమైన గౌరవం ఉంద‌ని అల్లు అర్జున్ చెప్ప‌క‌నే చెప్పాడు.

మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఒక సంస్థగా భావించే బ‌న్ని బాలీవుడ్‌ను ఒక చిన్న రఫ్ ప్యాచ్ కోసం విమర్శించడం అన్యాయం. దశాబ్దాలుగా హిందీ ప‌రిశ్ర‌మ‌ మ‌న‌కు అద్భుతమైన సినిమాలను అందించింద‌ని అన్నారు. ఇరు పరిశ్రమల మధ్య పరస్పర గౌరవం ఉండాల‌ని కోరుకున్నారు. సౌత్- బాలీవుడ్ సినిమాలు ఒకదానితో ఒక‌టి బాగా ప్రభావితం అవుతాయి. ``మేం విభిన్న ప్రాంతాల నుండి సోదరులలాగా క‌లిసి మెలిసి ఒక‌రికొక‌రు అపార గౌర‌వంతో ప‌ని చేస్తున్నాం`` అని వ్యాఖ్యానించాడు.

`పుష్ప: ది రైజ్` చిత్రంతో అల్లు అర్జున్ పేరు ఉత్త‌రాదినా మార్మోగింది. అత‌డు ఒక్కో సినిమాతో అనూహ్యంగా ఎదుగుతున్నాడు. `పుష్ప: ది రూల్` 15 ఆగస్ట్ 2024న థియేటర్లలోకి రానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రం త‌న పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని మ‌రింత విస్తురిస్తుంద‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ఇందులో త‌మ‌ పాత్రలను పునరావృతం చేస్తారు. దిశా పటాని ఇందులో ప్రత్యేక పాత్రలో న‌టిస్తోంది. ఈ సీక్వెల్ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది.