‘AA22’ హీరోయిన్ల హడావిడి.. సెట్టయ్యరా? లేదా?
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ సినిమా ‘AA22xA6’ గురించి రోజుకో కొత్త టాక్ వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 30 April 2025 6:29 AMపాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ సినిమా ‘AA22xA6’ గురించి రోజుకో కొత్త టాక్ వైరల్ అవుతోంది. ‘జవాన్’ ఫేమ్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్లో హైప్ పీక్స్లో ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్, యాక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ డబుల్ రోల్లో కనిపించనున్న ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, షూటింగ్ ఇంకా మొదలు కాలేదు, కానీ హీరోయిన్ల ఎంపిక గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఇద్దరు బాలీవుడ్ నటీమణులు మృణాళ్ ఠాకూర్, అనన్య పాండే ఫైనల్ అయ్యారని లేటెస్ట్ బజ్. మృణాళ్ ఠాకూర్ ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఇక అలాంటి టాలెంట్ టాలెంటెడ్ నటి అల్లు అర్జున్తో జోడీ కట్టడం అభిమానులకు కొత్త ఎక్సైట్మెంట్.
అనన్య పాండే లైగర్ తో ఫ్లాప్ ఎదురైనా కూడా ‘కేసరి చాప్టర్ 2’తో ఇప్పటికే బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగులో మరింత క్రేజ్ అందుకునే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాకు ఫ్రెష్ అప్పీల్ తీసుకొస్తుందని అంటున్నారు. అయితే, ఈ హీరోయిన్ల ఎంపిక ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదని ప్రొడక్షన్ టీమ్ సన్నిహితులు చెబుతున్నారు.
అట్లీ ఇంకా పలు నటీమణులతో డిస్కషన్స్ జరుపుతున్నాడట. షెడ్యూల్స్, రోల్స్ బట్టి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. సినిమా స్కేల్, అల్లు అర్జున్ డబుల్ రోల్, అట్లీ మార్క్ యాక్షన్ సీక్వెన్స్లు చూస్తే, ఈ ప్రాజెక్ట్ పాన్-ఇండియా లెవెల్లో బ్లాక్బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, హీరోయిన్ల ఎంపిక కీలకంగా మారింది. గతంలో ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె పేర్లు వినిపించాయి, కానీ ఆ వార్తలను టీమ్ ఖండించింది.
అలాగే, సమంత, కీర్తి సురేష్లు కూడా ఈ ప్రాజెక్ట్లో ఉంటారని ఊహాగానాలు వచ్చాయి. సమంత బర్త్డే సందర్భంగా అనౌన్స్మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ రూమర్స్ అన్నీ పక్కనపెడితే, మృణాళ్, అనన్య పేర్లే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సినిమాలో మూడో హీరోయిన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్గా ఉంది.
ఈ సినిమా రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోందని, అల్లు అర్జున్, అట్లీ కలిపి రూ.250 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, లోలా VFX స్టూడియో సపోర్ట్తో ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ముంబైలో లుక్ టెస్ట్లు కూడా జరిగాయట. మరి ఈ అప్డేట్స్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.