అల్లు అర్జున్ - అట్లీ.. ఈ పని మాత్రం సౌండ్ లేకుండానే..
అల్లు అర్జున్, అట్లీ సహా కొద్దిమంది యూనిట్ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఈ పూజ నిర్వహించారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 28 April 2025 2:03 PMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే నెవ్వర్ బిఫోర్ అనేలా రికార్డ్ క్రియేట్ చేసే సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మార్కెట్ను కుదిపేసిన 'పుష్ప 2' ఘన విజయం తర్వాత బన్నీ ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కొత్త ప్రాజెక్ట్కి #AA22 అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇప్పటికే బన్నీ బర్త్డే స్పెషల్గా విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. స్టార్టింగ్ లోనే ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేశారు అంటే ఇక నుంచి ప్రతీ వర్క్ గురించి హైప్ పెంచేలా అప్డేట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఒక పనిని మాత్రం సౌండ్ లేకుండానే స్టార్ట్ చేశారు. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ముంబైలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రహస్యంగా పూర్తి చేశారు.
అల్లు అర్జున్, అట్లీ సహా కొద్దిమంది యూనిట్ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఈ పూజ నిర్వహించారని తెలుస్తోంది. అంతేకాదు, సినిమా షూటింగ్ కూడా ముంబైలో స్టార్ట్ అవుతుందని సమాచారం. ముంబై షెడ్యూల్ తర్వాత విదేశాల్లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే పలు దేశాల్లో లొకేషన్లను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకొచ్చాయి.
అవతార్, స్పైడర్ మాన్, టెర్మినేటర్ లాంటి హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన టెక్నీషియన్లు ఇప్పుడు ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. అంతేకాదు, మోషన్ స్టూడియోస్ వంటి ప్రపంచ స్థాయి వీఎఫ్ఎక్స్ సంస్థలు భాగస్వామ్యమవడం ద్వారా, ఈ సినిమా విజువల్గా భారీ స్థాయిలో ఉండబోతోందని చెప్పొచ్చు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించిన ఊహాగానాలు ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ ఆసక్తి కలిగిస్తున్నాయి.
హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మృణాల్ ఠాకూర్, జాన్వీ, సమంత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ నిర్మాతలు అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా, అట్లీ చిత్రాలకు ప్రత్యేకమైన మాస్ టచ్ ఉండేలా గమనిస్తే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా మంచి డిమాండ్ ఉండబోతోందని అర్థం అవుతోంది. ఇక సినిమాను 2026 లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.