వైజాగ్ లో ఐకాన్ స్టార్ మల్టీప్లెక్స్!
ఏషియన్ గ్రూప్ తో టాలీవుడ్ స్టార్ హీరోల రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ మహేష్ అదే సంస్థ భాగస్వామ్యంలో ఏఎంబీ మాల్ ని నిర్మించారు.
By: Tupaki Desk | 11 Jun 2025 4:30 PMఏషియన్ గ్రూప్ తో టాలీవుడ్ స్టార్ హీరోల రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ మహేష్ అదే సంస్థ భాగస్వామ్యంలో ఏఎంబీ మాల్ ని నిర్మించారు. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. బెంగుళూరులోనూ మరో మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే గ్రూప్ తో అమీర్ పేట్ లో ఏఏఏ పేరుతో మల్టీప్లెక్స్ ని నిర్మించి గ్రాండ్ సక్సెస్ చేసిన సంగతి తెలిసిందే. సమీప ప్రాంత వాసులం దరికీ ఏఏఏ మంచి ఆస్వాదన అందిస్తుంది.
కెరీర్ పరంగా బన్నీ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. 'పుష్ప' విజయంతో పాన్ ఇండియా స్టార్ అయ్యా డు. దీంతో పారితోషికం కూడా రెట్టింపు అయింది. సినిమాకిప్పుడు వచ్చిన లాభాల్లో షేర్ అందుకుంటున్నాడు. దీంతో బన్నీ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఏపీ వా ణిజ్య రాజధాని విశాఖ పట్టణంలో ఏషీయన్ గ్రూప్ తో మరో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నటు తెలుస్తోంది.
విశాఖపట్టణంలో ఇనార్బిట్ మాల్ లో 8 స్క్రీన్లు 1500 మంది సిట్టింగ్ సామర్ధ్యంతో కూడిన మల్టీప్లెక్స్ ఏర్పా టు కాబోతుంది. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో లాంచ్ చేసే దిశగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో భారీ ఎత్తున కొత్త గా సినిమా స్టూడియోలు నిర్మించే దిశగా సినీ పెద్దలు కదులుతున్నట్లు వినిపిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినిమా పక్షపాతి కావడంతో సినిమా ఇండస్ట్రీ అభివృద్దికి ఆయన అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇసుకతోట ఓ ప్రముఖ స్టూడియో స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. స్టూడియో అభివృద్ది ఉండాల్సిన చోట రియల్ ఎస్టేట్ దందా నడవ డంతో వివాదం కోర్టుకెళ్లింది. ఇలాంటి ఆక్రమణలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.