ఆ నలుగురులో మిగతా ఇద్దరు సైలైంట్ గా!
ఈనేపథ్యంలో నలుగురు అంటూ ఆరోపణలు ఎదుర్కుంటోన్న వారిలో ఇద్దరు మీడియా ముందుకొచ్చారు.
By: Tupaki Desk | 27 May 2025 5:16 AMఇండస్ట్రీలో ఆ నలుగురు అన్న పదం తరుచూ వినిపిస్తుంది. ఆ నలుగురు చేతిలోనే థియేటర్లు ఉన్నా యని..ఆ నులుగురే పరిశ్రమను శాషిస్తున్నారని తరుచూ వినిపిస్తుంటుంది. కానీ ఆ నలుగురు ఎవరు? అన్నది మాత్రం అధికారికంగా ఎవరికీ తెలియదు. ఇటీవలే థియేటర్ల బంద్ విషయం తెరపైకి రావడంతో? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీన్ లోకి రావడం...తన సినిమాల్నే టార్గెట్ చేసి బంద్ కు పిలిపు నిచ్చారని ఆరోపించడంతో? సన్నివేశం ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.
ఈనేపథ్యంలో నలుగురు అంటూ ఆరోపణలు ఎదుర్కుంటోన్న వారిలో ఇద్దరు మీడియా ముందుకొచ్చారు. వారే అల్లు అరవింద్-దిల్ రాజు. ఆ నలుగురిలో నేను లేనంటూ...తనకు ఈ వివాధానికి ఎలాంటి సంబం ధం లేదని...కానీ థియేటర్లను బంద్ చేయడం అన్నది సమంజసం కాదన్నారు. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ మాత్రమే ఉందని..ఏపీలో మాత్రం 15 థియేటర్లు కూడా లేవన్నారు.
లీజు గడువు లేకపోతే వాటిని పునరుద్దించే ప్రయత్నం కూడా చేయనన్నారు. ఆ వ్యాపారం నుంచే పూర్తిగా బయటకు వచ్చేసానన్నారు. అటుపై దిల్ రాజు మీడియా ముందుకొచ్చి ఆ నలుగురు అంటూ ఇష్టారీతున కథనాలు రాస్తున్నారని, అందులోకి తన పేరు తీసుకు రావొద్దని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు ఉన్న థియేటర్ల గురించి చెప్పుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము..దైర్యం ఎవరికీ లేవని అంతటి సాహసం ఎవరు చేస్తారన్నారు.
అలాగే ఇండస్ట్రీ పెద్దల మధ్య ఉన్న ఐక్యత గురించి అసహనాన్ని వ్యక్తం చేసారు. థియేటర్ల బంద్ అనేది కేవలం ఓ అపోహగా పేర్కొన్నారు. ఇలా దిల్ రాజు..అరవింద్ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు రావడంతో కొంత క్లారిటీ వచ్చింది. మరి మిగతా ఇద్దరు ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. తదుపరి మీడియా ముందుకొచ్చే మూడవ వ్యక్తి ఎవరు? నాల్గవ వ్యక్తి ఎవరు? అన్న దానిపై అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది. మరి వాళ్లు ఇప్పటికైనా బయటకు వస్తారా? లేక అలా మౌనంగానే ఉంటారా? అన్నది చూడాలి.