Begin typing your search above and press return to search.

ఫ్రీ ఫ్రీ... నిజమా? నమ్మలేకపోతున్నాం

అక్షయ్‌ కుమార్‌ 'ఓ మై గాడ్‌ 2' సినిమాకు తీసుకున్న పారితోషికం విషయంలో గత కొన్నాళ్లుగా ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   20 Aug 2023 7:33 AM GMT
ఫ్రీ ఫ్రీ... నిజమా? నమ్మలేకపోతున్నాం
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో నిలవడంతో పాటు తన ఆదాయంతో ఏకంగా ఫోర్బ్స్ లో చోటు దక్కించుకున్నాడు. పలువురు హాలీవుడ్‌ స్టార్స్ ను కూడా తన ఆదాయంతో వెనక్కు నెటిన ఘనత అక్షయ్ కుమార్‌ కు దక్కింది.

అలాంటి అక్షయ్‌ కుమార్‌ 'ఓ మై గాడ్‌ 2' సినిమాకు తీసుకున్న పారితోషికం విషయంలో గత కొన్నాళ్లుగా ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. వందల కోట్ల పారితోషికం తీసుకుని సినిమాలు చేసే అక్షయ్‌ కుమార్‌ సూపర్ హిట్‌ మూవీ ప్రాంచైజీ కనుక ఈ సీక్వెల్‌ కు అంతకు మించి అన్నట్లుగా పారితోషికం తీసుకుని ఉంటాడు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

తాజాగా ఓ మై గాడ్‌ 2 చిత్ర నిర్మాతల్లో ఒకరు అయిన అజిత్ అంధారె మాట్లాడుతూ అక్షయ్‌ కుమార్‌ పారితోషికం గురించి షాకింగ్‌ విషయాలను వెళ్లడించాడు. చాలా మంది అక్షయ్‌ కుమార్‌ భారీ పారితోషికం తీసుకున్నాడు అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అంటే ఈ సీక్వెల్‌ కోసం మేము అక్షయ్‌ కుమార్‌ కు అస్సలు పారితోషికం ఇవ్వలేదు.

ఓ మై గాడ్‌ 2 సినిమా కోసం అక్షయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. అతే కాకుండా తాము ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు తమకు సహకరించాడు అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు. నిర్మాత అజిత్ అంధారె మాటలు నమ్మశక్యంగా లేవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం అక్షయ్‌ కుమార్ గొప్పతనంకు హ్యాట్సాఫ్‌ అంటున్నారు.

ఈ మధ్య కాలంలో హీరోలు చాలా మంది పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకుంటూ ఉన్నారు. మరి అక్షయ్‌ కుమార్‌ కూడా అలాగే తీసుకుని ఉంటాడేమో. సినిమా మేకింగ్ సమయంలో ఒక్క రూపాయి తీసుకుని ఉండక పోవచ్చు. కానీ లాభాల్లో వాటాను పారితోషికంగా తీసుకుని ఉండగా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే హీరో అక్షయ్ కుమార్‌ స్పందించాల్సిందే.