బాలీవుడ్ దీన స్థితి.. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం
బాలీవుడ్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. ఒకప్పుడు సింపుల్గా రూ.100 కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించిన హీరోలు ఇప్పుడు మినిమం హిట్ కూడా కొట్టలేక ఢీలా పడుతున్నారు.
By: Tupaki Desk | 21 April 2025 7:27 AMబాలీవుడ్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. ఒకప్పుడు సింపుల్గా రూ.100 కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించిన హీరోలు ఇప్పుడు మినిమం హిట్ కూడా కొట్టలేక ఢీలా పడుతున్నారు. బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు ఆయన సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా నిలిచిన విషయం తెల్సిందే. కానీ గత అయిదు సంవత్సరాల్లో అక్షయ్ కుమార్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్గా నిలిచాయి. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న సినిమాలు కూడా అతి తక్కువ వసూళ్లు నమోదు చేశాయి. సౌత్ స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్స్ వందల కోట్లకు మించి నమోదు అవుతున్నాయి.
సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ఉంటే, హిందీ సినిమాలు లాంగ్ రన్లోనూ ఆ స్థాయి వసూళ్లు సొంతం చేసుకోలేక పోతున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేసరి చాప్టర్ 2 సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అక్షయ్ కుమార్ చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు సైతం కేసరి 2 సినిమాను సూపర్ హిట్గా ప్రచారం చేస్తున్నారు. పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు, ప్రేక్షకులు సైతం సినిమాకు సోషల్ మీడియా ద్వారా పాజిటివ్ స్పందన తెలియజేస్తున్నారు. దాంతో కేసరి 2 సినిమా హిట్ అని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అక్షయ్ కుమార్ బాలీవుడ్లోనే టాప్ హీరో. ఆయన సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా మొదటి రోజు నమోదు అయిన కలెక్షన్స్ చూస్తే బాలీవుడ్ ఎలాంటి దీన స్థితిని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కేసరి 2 సినిమా మొదటి రోజు దాదాపు రూ.15 కోట్లు వసూళ్లు చేసింది. సౌత్ లో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా పాతిక కోట్లకు తగ్గకుండా వసూళ్లు నమోదు చేస్తాయి. కానీ బాలీవుడ్ మూవీ హిట్ టాక్ దక్కించుకున్నా మొదటి రోజు రూ.15 కోట్ల వసూళ్లు నమోదు చేయడం చూస్తే హిందీ సినిమా ఎదుర్కొంటున్న సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేసరి 2 సినిమాకు మొదటి రెండు రోజుల్లో దాదాపు రూ.30 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ కోర్టు రూం డ్రామా లో అక్షయ్ కుమార్తో పాటు మాధవన్ కీలక పాత్రలో నటించాడు. అనన్య పాండే ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది. కేసరి 2 సినిమాకు లాంగ్ రన్లోనూ కనీసం రూ.100 కోట్ల వసూళ్లు నమోదు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చినా, వసూళ్లు నమోదు కాకపోవడం చూస్తూ ఉంటే, ముందు ముందు పెద్ద హీరోల సినిమాలు థియేటర్ రిలీజ్ స్కిప్ చేసే పరిస్థితులు రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.