2026 సంక్రాంతిని టార్గెట్ చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను `అఖండ`తో హ్యాట్రిక్ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 21 April 2025 9:45 AMనందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను `అఖండ`తో హ్యాట్రిక్ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. `సింహ`తో మొదలైన వీరి కాంబినేషన్ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ సక్సెస్ ఫుల్గా కనసాగుతోంది. 2023లో భారీ డిజాస్టర్ని ఎదుర్కొన్న బోయపాటి మళ్లీ సక్సెస్ కోసం బాలయ్యే నమ్ముకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణతో బ్లాక్బస్టర్ మూవీ `అఖండ`కు సీక్వెల్గా ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. `అఖండ తాండవం` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని 14 ప్లస్రీల్స్ బ్యానర్పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.
ప్రగ్యా జైస్వాల్, సంయుక్తమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలయ్య డ్యుయెల్ రల్లో నటిస్తున్నారు. ఇందులోనూ అఘోరగా కనిపించి శివతాండవం చేయబోతున్నారట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ ఈ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ డేట్ ని మాత్రం అఖండ 2` రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
దీనికి కారణం వీఎఫ్ ఎక్స్ అని తెలుస్తోంది. అనుకున్న సమయానికి వీఎఫ్ ఎక్స్ వర్క్ పూర్తి అయ్యే అవకాశం లేకపోవడంతో టీమ్ ఈ మూవీ రిలీజ్ని సెప్టెంబర్ 25 నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యకు బోయపాటికి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని ప్రచారం జరగడం, దానిక ఇపై టీమ్ క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. తమన్ నేపథ్య సంగీతం `అఖండ`కు హైలైట్ కావడం, సినిమా విజయంలో భాగం కావడంతో పార్ట్ 2కు కూడా తమన్ కీలకంగా మారే అవకాశ ఉందని ఇన్ సైడ్ టాక్.