Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ కూతురికి 50కోట్ల విలువైన భ‌వంతి కానుక‌

ముంబై సబర్బన్‌లోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన `ప్రతీక్ష` అనే పాపుల‌ర్ బంగ్లాను అమితాబ్ తన కుమార్తెకు బహుకరించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:07 AM GMT
సూప‌ర్‌స్టార్ కూతురికి 50కోట్ల విలువైన భ‌వంతి కానుక‌
X

ఈ సృష్టి మొత్తం ప్రేమ అనే బంధంతో ముడిప‌డి ఉంది. తండ్రి కూతుళ్ల న‌డుమ ప్రేమ‌.. తాత మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య ప్రేమ లేదా భార్యా భ‌ర్త‌ల ప్రేమ అక్కా చెల్లెళ్ల ప్రేమ‌.. అన్నా చెల్లెళ్ల .. తండ్రి కూతుల్ల న‌డుమ‌ ప్రేమ ఇలా ఎన్ని ర‌కాల ప్రేమ‌ల‌ను అయినా త‌ర‌చి చూడ‌వ‌చ్చు. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలోను ఈ ప్రేమ‌లు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. ఆయ‌న‌ మెగాస్టార్ మాత్రమే కాదు.. బాధ్య‌త గ‌ల తండ్రి మామ గారు కూడా. . తన బ్లాగులు మరియు రచనలలో అమితాబ్ తన పిల్లలు మనవరాళ్లపై తన ప్రేమను తరచుగా ప్రస్తావించాడు. ఇప్పుడు తండ్రి హోదాలో తన కుమార్తె శ్వేతా బచ్చన్‌కు విలువైన బహుమతిని అందించాడు. ముంబై సబర్బన్‌లోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన `ప్రతీక్ష` అనే పాపుల‌ర్ బంగ్లాను అమితాబ్ తన కుమార్తెకు బహుకరించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి.

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ ఆస్తి విఠల్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో భాగంగా ముంబై- జుహులోని ప్రధాన ప్రాంతంలో 890.47 చదరపు మీటర్ల పొడ‌వు, 674 చదరపు మీటర్ల వెడ‌ల్పుతో ఉన్న రెండు ప్లాట్‌లలో ఉంది. నవంబర్ 8న సంతకం చేసిన గిఫ్ట్ డీడ్ రూపంలో శ్వేతా బచ్చన్‌కు బంగ్లాను బహూకరించినట్లు తెలిసింది. దీని స్టాంప్ డ్యూటీ రూ. 50.65 లక్షలు చెల్లించారు. అమితాబ్ బచ్చన్ -జ‌యా బచ్చన్ దాతలు కాగా, కానుక అందుకున్న‌ వ్యక్తి పేరు శ్వేతా నంద అని వెల్లడైంది. అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన‌ మొదటి బంగళా ఇది. సెంటిమెంటుగా త‌న‌ హృదయానికి చాలా దగ్గరగా ఉండే బంగ్లాలలో ప్రతీక్ష కూడా ఒకటి.

శ్వేతా బచ్చన్ గురించి చెప్పాలంటే.. ఆమె ఎప్పుడూ సినిమాలకు దూరంగా ఉంటుంది. వ్యాపార దిగ్గజం నిఖిల్ నందాను వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్య నవేలి నందా తన తండ్రి అడుగుజాడలను అనుసరించాలని నిర్ణయించుకుంది. వ్యాపారవేత్తగా మారింది. అలాగే జోయా అక్తర్ చిత్రం ది ఆర్చీస్‌తో బాలీవుడ్‌లోకి అగ‌స్త్య నందా అరంగేట్రం చేయనున్న సంగ‌తి తెలిసిందే.

మరోవైపు, అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ ఫిల్మ్ సర్క్యూట్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయ‌న వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్, దీపిక‌, దిశా పటాని త‌దితరులతో కలిసి కల్కి 2898 ADలో న‌టిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.