Begin typing your search above and press return to search.

14 ఏళ్ల తర్వాత స్టార్స్ కలయిక...!

పాన్ ఇండియా రేంజ్ లో మలయాళ సినిమాలు కుమ్మేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   17 April 2024 4:24 AM GMT
14 ఏళ్ల తర్వాత స్టార్స్ కలయిక...!
X

ఇతర సినిమా ఇండస్ట్రీలతో పోల్చితే మలయాళ సినిమా ఇండస్ట్రీలో అరుదైన కలయికల్లో సినిమాలు వస్తూ ఉంటాయి, అంతే కాకుండా సున్నితమైన అంశాలతో కథలు రూపొందిస్తూ, విభిన్నమైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలను అక్కడి ఫిల్మ్ మేకర్స్ తీసుకు వస్తూ ఉన్నారు.


ఈ మధ్య కాలంలో కమర్షియల్‌ గా కూడా మలయాళ సినిమాలు ఇతర భాషల సినిమాలతో పోటీ పడుతూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో మలయాళ సినిమాలు కుమ్మేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో అరుదైన కలయికలో సినిమా రాబోతుంది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ ఇటీవలే బ్రహ్మయుగం అనే విభిన్నమైన సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకుని, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక గోట్‌ లైఫ్ సినిమాతో పృథ్వీరాజ్ సుకుమారన్‌ పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా జాతీయ స్థాయి అవార్డు దక్కించుకునే విధంగా పృథ్వీరాజ్ నటన ఉందంటూ ప్రశంసలు దక్కాయి.

వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ఒక సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిసి పోకిరి రాజా సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూడబోతున్నందుకు మలయాళ ప్రేక్షకులతో పాటు, పాన్ ఇండియా రేంజ్ మలయాళ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆంటో జోసెఫ్‌ నిర్మాణంలో రూపొందబోతున్న ఈ అరుదైన మల్టీ స్టారర్‌ మూవీతో కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు. ఈ సినిమాలో మమ్ముటీ, పృథ్వీరాజ్‌ సుకుమారన్ లు విరోధులుగా కనిపించబోతున్నారట. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి.