Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ ఆ స్టార్ తో ఫిక్స్..!

టెంపర్ తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టు అనిపించిన పూరీ మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 3:45 AM GMT
డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ ఆ స్టార్ తో ఫిక్స్..!
X

ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ లో చాలా వెనుక పడ్డాడు. ఆర్జీవి శిష్యుడిగా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న పూరీ పర్సనల్ గా హిట్లకు ఫ్లాపులకు ఒకేలా ఉన్నా కెరీర్ గ్రాఫ్ మాత్రం పడిపోతూ వచ్చింది. టెంపర్ తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టు అనిపించిన పూరీ మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు. రాం తో తీసిన ఇస్మార్ట్ శంకర్ మళ్లీ పూరీ మీద హోప్ కలిగేలా చేసింది. ఆ సినిమా రామ్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

ఆ సినిమా హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండతో లైగర్ తీసి మళ్లీ పెద్ద షాక్ ఇచ్చాడు పూరీ. ఆ సినిమా తర్వాత పూరీతో సినిమా అంటే హీరోలంతా రిస్క్ అనుకునే టాక్ వచ్చింది. అయితే మళ్లీ ఇస్మార్ట్ శంకర్ కాంబో కలిసి సినిమా చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ అంటూ పూరీ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న పూరీ ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని చూస్తున్నాడు.

ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ చేసే సినిమా ఏంటన్న దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ డాషింగ్ హీరో బాలకృష్ణతో సినిమా చేస్తాడని అంటున్నారు. బాలయ్య పూరీ ఇద్దరు కలిసి పైసా వసూల్ సినిమా చేశారు. అరె మామా ఏక్ పెగ్ లావో అంటూ బాలయ్యతో పూరీ చేయించిన హంగామా తెలిసిందే. ఆ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ నందమూరి ఫ్యాన్స్ కి బాగా నచ్చింది.

అయితే ఆ సినిమా తర్వాత చాలా సందర్భాల్లో పూరీ బాలకృష్ణ కాంబో సినిమా చర్చల్లోకి వచ్చింది. పూరీ డబుల్ ఇస్మార్ట్ పూర్తి చేయగానే బాలయ్య సినిమా మీద వర్క్ చేస్తారని తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం 109వ సినిమా చేస్తున్నారు. అది కాగానే పూరీ సినిమా ఉంటుందని చెబుతున్నారు. పూరీ సినిమా తర్వాతే అఖండ 2 ఉంటుందని టాక్. మరి పైసా వసూల్ కాంబో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. పూరీతో బాలయ్య సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ లో కూడా ఎగ్జైట్మెంట్ బాగుంటుంది. ఈ కాంబో సినిమా ఈసారి ప్లానింగ్ పెద్దగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు.